AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్‌డౌన్‌ పొడిగించండి: మోదీని కోరిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌లో మే 3 తర్వాత కూడా లాక్‌డౌన్‌ పొడిగించాలని ప్రధాని నరేంద్ర మోదీని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. కరోనా పరిస్థితులపై ప్రధానితో మాట్లాడిన జగన్.. లాక్‌డౌన్‌ పొడిగింపు చేయాలని కోరినట్లు సమాచారం. ఏపీలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది.  కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1177కు చేరింది. గడిచిన 24 గంటల్లో 80 కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ క్రమంలోనే లాక్‌డౌన్‌ను కొనసాగించాలని జగన్‌, ప్రధానిని […]

లాక్‌డౌన్‌ పొడిగించండి: మోదీని కోరిన సీఎం జగన్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 27, 2020 | 3:10 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో మే 3 తర్వాత కూడా లాక్‌డౌన్‌ పొడిగించాలని ప్రధాని నరేంద్ర మోదీని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. కరోనా పరిస్థితులపై ప్రధానితో మాట్లాడిన జగన్.. లాక్‌డౌన్‌ పొడిగింపు చేయాలని కోరినట్లు సమాచారం. ఏపీలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది.  కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1177కు చేరింది. గడిచిన 24 గంటల్లో 80 కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ క్రమంలోనే లాక్‌డౌన్‌ను కొనసాగించాలని జగన్‌, ప్రధానిని కోరినట్లు తెలిసింది.

ఇదిలా ఉంటే కరోనా నియంత్రణ, లాక్‌డౌన్‌ అమలుపై ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ  వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన విషయం తెలిసిందే. రెండున్నర గంటలకు పైగా ఈ  వీడియో కాన్ఫరెన్స్‌ జరగగా.. కరోనా నిర్మూలన, లాక్‌డౌన్‌ పొడిగింపు, దశలవారీ లాక్‌డౌన్‌ సడలింపులపై సీఎంలతో మోదీ సుధీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల సీఎంలు లాక్‌డౌన్‌ పొడిగింపుకే మొగ్గు చూపినట్లు సమాచారం.

Read This Story Also: జగన్ బయోపిక్‌ వచ్చేది అప్పుడే.. ‘యాత్ర’ దర్శకుడు క్లారిటీ..!