AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘రైతు భరోసా’ లో కులం చిచ్చు…! బిగ్ న్యూస్-బిగ్ డిబేట్

ఆంధ్రప్రదేశ్‌లోరైతుభరోసా-పీఎం కిసాన్‌ పథకం అమల్లోకి వచ్చింది. నెల్లూరు జిల్లా… కాకుటూరులో సీఎం వైఎస్‌ జగన్‌ ఈ పథకాన్ని ప్రారంభించారు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సీఎం జగన్… పథకాన్ని ప్రారంభించి… కౌలు రైతులకు రైతు భరోసా పథకం కార్డులు ఇవ్వడంతో పాటూ… రైతులకు రైతు భరోసా పథకం కింద వ్యవసాయ పెట్టుబడి సాయంగా చెక్కులు ఇచ్చారు. ఈ రైతు భరోసా పథకానికి రూ.5,510 కోట్లను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. […]

'రైతు భరోసా' లో కులం చిచ్చు...! బిగ్ న్యూస్-బిగ్ డిబేట్
Ram Naramaneni
|

Updated on: Oct 15, 2019 | 11:31 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లోరైతుభరోసా-పీఎం కిసాన్‌ పథకం అమల్లోకి వచ్చింది. నెల్లూరు జిల్లా… కాకుటూరులో సీఎం వైఎస్‌ జగన్‌ ఈ పథకాన్ని ప్రారంభించారు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సీఎం జగన్… పథకాన్ని ప్రారంభించి… కౌలు రైతులకు రైతు భరోసా పథకం కార్డులు ఇవ్వడంతో పాటూ… రైతులకు రైతు భరోసా పథకం కింద వ్యవసాయ పెట్టుబడి సాయంగా చెక్కులు ఇచ్చారు. ఈ రైతు భరోసా పథకానికి రూ.5,510 కోట్లను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ స్కీం ద్వారా… ఏపీలో 50 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం తెలిపింది. 3 లక్షల మంది కౌలు రైతులకు కూడా మేలు జరుగుతుందని వివరించింది.

జగన్‌ సర్కార్‌ ప్రవేశపెట్టిన ఈ స్కీం  ఏపీ పాలిటిక్స్‌లో కొత్త చర్చను లేవనెత్తింది. పథకాన్ని ముందే తెచ్చి, చెప్పినదానికంటే ఐదేళ్లలో ఎక్కువగా డబ్బులు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రతిపక్షం మాత్రం- ఐదేళ్లలో రైతులకు 10వేల కోట్ల రూపాయల ద్రోహం జరిగినట్లు వాదిస్తోంది. కౌలు రైతులకు దేశంలోకెల్లా ఇంతసాయం చేస్తున్నది తామేనంటూ జగన్‌ చెబుతుంటే, కౌలురైతుల విషయంలో కూడా కులాలు ఎందుకని టీడీపీ ప్రశ్నిస్తోంది. అగ్రవర్ణ కౌలు రైతులపై ఏపీ ప్రభుత్వం వివక్ష చూపుతుందంటూ టీడీపీతో పాటు కాంగ్రెస్ కూడా ఆరోపిస్తుంది. ప్రతిపక్షాల విమర్శలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ విషయంపై టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ఆధ్వర్యంలో బిగ్ న్యూస్ – బిగ్ డిబేట్ వేదికగా కీలక చర్చ జరిగింది. ఈ డిష్కసన్‌లో ఏపీ ప్రభుత్వం తరుపున ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ తరుపున ఆలపాటి రాజా, కాంగ్రెస్ తరుపున తులసీ రెడ్డి, బిజేపీ తరుపున విష్టువర్థన్ రెడ్డి పాల్గొన్నారు. ఆ డిటేల్స్ దిగువ వీడియోలో…!