టీటీడీ భూముల అమ్మక తీర్మానంపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!

తిరుమల తిరుపతి దేవస్థానానికి(టీటీడీ)కి చెందిన ఆస్తుల అమ్మక నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భూముల అమ్మకంపై చేసిన తీర్మానాన్ని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 2016 జనవరి 30న టీటీడీ ట్రస్ట్ బోర్టు తమకు చెందిన 50 ఆస్తులను విక్రయించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి తీర్మానం నెం. 252 నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొనే ఈ […]

టీటీడీ భూముల అమ్మక తీర్మానంపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!
Follow us

| Edited By:

Updated on: May 26, 2020 | 11:03 AM

తిరుమల తిరుపతి దేవస్థానానికి(టీటీడీ)కి చెందిన ఆస్తుల అమ్మక నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భూముల అమ్మకంపై చేసిన తీర్మానాన్ని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 2016 జనవరి 30న టీటీడీ ట్రస్ట్ బోర్టు తమకు చెందిన 50 ఆస్తులను విక్రయించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి తీర్మానం నెం. 252 నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఈ వ్యవహారంపై మత పెద్దలు, ధార్మిక సంస్థలు, భక్తులు ఇతర భాగస్వామ్య పక్షాలతో చర్చించిన తరువాతనే తుది నిర్ణయం తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు ఆ స్థలాల్లో దేవాలయల నిర్మాణం, ధర్మ ప్రచార కార్యక్రమాలు చేపట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ అంశాలన్నీ పరిశీలించే వరకు భూముల విక్రయాల ప్రక్రియను నిలుపుదల చేయాలని ప్రభుత్వం స్పష్టం చేయడం గమనర్హం.

కాగా 2016 తీర్మానానికి అనుగుణంగా వేరే రాష్ట్రాల్లో ఉన్న 50 ఆస్తులను వేలం ప్రక్రియలో విక్రయించాలని కొద్ది రోజుల క్రితం టీటీడీ బోర్డు నిర్ణయించింది. దీనిపై రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం మొదలైంది. ఈ క్రమంలో టీటీడీ భూముల అమ్మకంపై విస్తృత సంప్రదింపులు జరిపిన తరువాతే ముందుకు వెళ్లాలని జగన్ సర్కార్‌ నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

Read This Story Also:  సోమ‌వారం ఒక్కరోజే 532 విమాన సర్వీసులు…