AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్టీసీకి రూ.17.51 కోట్లు చెల్లించిన ఏపీ ప్రభుత్వం

వలస కార్మికులను వారి వారి స్వగ్రామాలకు తరలించినందుకు గానూ ఆర్టీసీకి ఏపీ ప్రభుత్వం రూ.15.71కోట్లు చెల్లించింది. ఈ నిధులతో ఆర్టీసీలో ఒప్పంద కార్మికుల మే నెల వేతనాలు, బకాయిలు చెల్లించింది ఆర్టీసీ.

ఆర్టీసీకి రూ.17.51 కోట్లు చెల్లించిన ఏపీ ప్రభుత్వం
TV9 Telugu Digital Desk
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Jul 09, 2020 | 5:55 PM

Share

వలస కార్మికులను వారి వారి స్వగ్రామాలకు తరలించినందుకు గానూ ఆర్టీసీకి ఏపీ ప్రభుత్వం రూ.15.71కోట్లు చెల్లించింది. ఈ నిధులతో ఆర్టీసీలో ఒప్పంద కార్మికుల మే నెల వేతనాలు, బకాయిలు చెల్లించింది ఆర్టీసీ. అలాగే విశ్రాంత ఉద్యోగుల జూన్ నెల ఎస్ఆర్‌బీఎస్‌ పెన్షన్, ఎస్‌బీటీ చెల్లించారు. వాటితో పాటు ఐటీఐ అప్రెంటీస్‌లకు స్టైపండ్, ఉద్యోగుల వైద్య ఖర్చులు, నిర్వహణ, డీజిల్ ఖర్చులు చెల్లింపులను ఆర్టీసీ  చెల్లించింది.

కాగా లాక్‌డౌన్ నేపథ్యంలో వలస కార్మికులు అన్ని రాష్ట్రాల్లో చిక్కుకున్నారు. ఆ తరువాత చాలా మంది కార్మికులు కాలి నడకన తమ స్వరాష్ట్రాలకు వెళ్లారు. ఆ నేపథ్యంలో ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. ఇక వలస కార్మికులను తరలించేందుకు ఆ మధ్యన స్పెషల్ ట్రైన్‌లను నడిపింది కేంద్ర ప్రభుత్వం. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వలస కార్మికులను తరలించేందుకు ప్రత్యేక బస్సులను నడిపారు. అలాగే సోనూసూద్‌, అమితాబ్‌ లాంటి ప్రముఖులు సైతం వలస కార్మికులను తరలించేందుకు తమ వంతు సాయం చేసిన విషయం తెలిసిందే.