AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: రూ.36 వేలకు.. 9 వేలు వడ్డీ అంటూ వసూలు చేశారు.. చివరకు అసలు విషయం తెలిసి..

కృష్ణాజిల్లా గన్నవరంలో ఓ బురిడీ కంపనీ జనాన్ని నట్టేట ముంచేసింది. ఆరేళ్ల పాటు జనం దగ్గర డబ్బు కట్టించుకుని పత్తా లేకుండా పారిపోయింది. దీంతో లబోదిబోమనడం బాధితుల వంతయ్యింది.

Andhra Pradesh: రూ.36 వేలకు.. 9 వేలు వడ్డీ అంటూ వసూలు చేశారు.. చివరకు అసలు విషయం తెలిసి..
Cheating Case
Shaik Madar Saheb
|

Updated on: Feb 27, 2023 | 9:40 AM

Share

ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా గన్నవరంలో ఓ ఘరానా మోసం బయట పడింది. నెలకు వెయ్యి చప్పున మూడు సంవత్సరాలు 36 వేలు కడితే మూడేళ్ళ తర్వాత 9 వేలు వడ్డీ వస్తుందంటూ.. ఓ ముఠా భారీ మోసానికి పాల్పడింది. డబ్బు కట్టించుకుని ఆదర్శ కోపరేటివ్ సొసైటీ బ్యాంక్ పాస్ బుక్స్ ఇచ్చింది. డబ్బు కట్టించుకుని మూడేళ్లయినా సరే తిరిగి ఇవ్వక పోవడంతో నిలదీశారు బాధితులు. ఏం చేసుకుంటారో చేసుకోండి.. అంటూ ఆదర్శ్ సొసైటీ.. చెప్పడంతో.. అందరూ తిరగబడ్డారు. దీంతో కట్టించుకున్న వాళ్లు కనిపించకుండా పరారై పోయారు. దీంతో మోసపోయామంటూ.. గన్నవరం పోలీసులను ఆశ్రయించారు బాధితులు.

ఈ సంస్థ ద్వారా మోసపోయిన వారు 20 మంది వరకూ పోలీస్టేషన్ కి వచ్చారు. 2017 నుంచి ఇప్పటి వరకూ 25 లక్షల వరకూ వసూలు చేసినట్టు గుర్తించారు పోలీసులు. గతంలో బాధితులు డబ్బు కట్టించుకున్న కోపరేటివ్ బ్యాంకు దగ్గరకు వెళ్లగా.. అసలు అలాంటి బ్యాంకే లేదనడంతో.. తీవ్ర ఆందోళన చెందారు బాధితులు. ఆస్పత్రుల ఖర్చులకూ పిల్లల చదువులకు పెళ్లిళ్లకు.. దాచుకున్న సొమ్ము పట్టుకుని పారిపోవడంతో.. లబోదిబోమంటున్నారు బాధితులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..