AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కుబేర మూవీ తరహా స్కాం… నెల్లూరులో వెలుగు చూసిన దొపిడి

అమాయకులను ఆసరగా చేసుకుని రకరకాల కేటుగాళ్లు రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. నెల్లూరు జిల్లాలో ఓ సరికొత్త చీటింగ్‌ వెలుగు చూసింది. అచ్చం కుబేర సినిమా తరమాలో ఈ స్కాం బయటపడింది. యాక్సిస్ బ్యాంక్ కేంద్రంగా రూ.10.60 కోట్ల మేర దోపిడి చేశారు కేటుగాళ్ళు. అమాయక...

Andhra Pradesh: కుబేర మూవీ తరహా స్కాం... నెల్లూరులో వెలుగు చూసిన దొపిడి
Loan Scam
Ch Murali
| Edited By: |

Updated on: Jul 20, 2025 | 9:26 PM

Share

అమాయకులను ఆసరగా చేసుకుని రకరకాల కేటుగాళ్లు రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. నెల్లూరు జిల్లాలో ఓ సరికొత్త చీటింగ్‌ వెలుగు చూసింది. అచ్చం కుబేర సినిమా తరమాలో ఈ స్కాం బయటపడింది. యాక్సిస్ బ్యాంక్ కేంద్రంగా రూ.10.60 కోట్ల మేర దోపిడి చేశారు కేటుగాళ్ళు. అమాయక గిరిజనులకు రుణాలు ఇస్తామని నమ్మించి నట్టేట ముంచారు. దాదాపు 56 మంది పేరిట లోన్లు తీసుకుని సైలెంట్‌గా నొక్కేశారు. ఫేక్ కంపెనీలు ఏర్పాటు చేసి.. గిరిజనులను ఉద్యోగులుగా చూపించి.. వారి పేరు మీద లోన్లు అప్లై చేసి, ఏంచక్కా సొమ్ము లూఠీ చేశారు.

ఆరు నెలల పాటు గిరిజనులకు జీతాలు ఇస్తున్నట్లు స్టేట్మెంట్లు క్రియేట్‌ చేసింది ముఠా. గిరిజనుల పేరు మీద యాక్సిస్ బ్యాంక్ లో లోన్లు తీసుకున్నారు కేటుగాళ్ళు. 2022 -2024 మధ్య ఈ స్కామ్ జరిగినట్లు గుర్తించారు. అయితే లోన్లు కట్టాలంటూ గిరిజనులకు నోటీసులు పంపింది యాక్సిస్ బ్యాంక్ యాజమాన్యం. దీంతో నోటీసులు అందుకున్న గిరిజన యువకులు అంతా అవాక్కయ్యారు.

2024 లో వాసుదేవ నాయుడు, అల్లాభక్షు, శివ, వెంకట్ అనే వ్యక్తుల మీద ముత్తుకూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు బ్రాంచ్ మేనేజర్ మదన్ మోహన్. ఈ భారీ స్కాం లో బ్యాంకు ఉద్యోగుల పాత్ర పై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముత్తుకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.