AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తూర్పు తీరంలో అమెరికా నౌక

విశాఖ తీరంలో అమెరికా సముద్రయాన యుద్ధనౌక సందడి చేసింది. అమెరికా నౌక యూఎస్ఎస్ జాన్ పి.ముర్తా మూడు రోజుల కోసం విశాఖ తీరానికి వచ్చింది. యూఎస్ కాన్సుల్ జనరల్‌తో పాటు భారత నౌకాదళ అధికారులు ఈ నౌకకు స్వాగతం పలికారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్-అమెరికాల మధ్య పరస్పర సహకారంలో భాగంగా ఈ నౌక విశాఖపట్నానికి వచ్చిందని అధికారులు తెలిపారు. అధికారులు ఎంపిక చేసిన విద్యార్థులకు ఈ నౌకను సందర్శించే అవకాశం కల్పిస్తున్నారు. ఈ నౌక మూడు […]

తూర్పు తీరంలో అమెరికా నౌక
Pardhasaradhi Peri
|

Updated on: Jun 14, 2019 | 2:56 PM

Share

విశాఖ తీరంలో అమెరికా సముద్రయాన యుద్ధనౌక సందడి చేసింది. అమెరికా నౌక యూఎస్ఎస్ జాన్ పి.ముర్తా మూడు రోజుల కోసం విశాఖ తీరానికి వచ్చింది. యూఎస్ కాన్సుల్ జనరల్‌తో పాటు భారత నౌకాదళ అధికారులు ఈ నౌకకు స్వాగతం పలికారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్-అమెరికాల మధ్య పరస్పర సహకారంలో భాగంగా ఈ నౌక విశాఖపట్నానికి వచ్చిందని అధికారులు తెలిపారు. అధికారులు ఎంపిక చేసిన విద్యార్థులకు ఈ నౌకను సందర్శించే అవకాశం కల్పిస్తున్నారు. ఈ నౌక మూడు రోజుల పర్యటన సందర్భంగా విశాఖలో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.