AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. భారతీయులు మృతి

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన తండ్రీ కుమార్తెలు మృత్యువాత పడ్డారు. కర్ణాటకలోని బీదర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ నిపుణుడు ముఖేశ్ శివాజీవార దేశ్ నార్త్ కరోలినాలో నివశిస్తున్నారు. ర్యాలిష్‌లోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. ముఖేశ్ దేశ్‌ముఖ్, ఆయన భార్య మౌనిక, కూతురు మూడేళ్ల దివిజ కారులో వెళుతుండగా విల్లింగ్‌టన్‌కు 70 మైళ్ల దూరంలో ప్రమాదం చోటుచేసుకుంది. వీరు కారు ఒక ట్రాక్కును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముఖేశ్‌తో పాటు కూతురు దివిజ […]

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. భారతీయులు మృతి
Pardhasaradhi Peri
|

Updated on: Jun 14, 2019 | 3:00 PM

Share

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన తండ్రీ కుమార్తెలు మృత్యువాత పడ్డారు. కర్ణాటకలోని బీదర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ నిపుణుడు ముఖేశ్ శివాజీవార దేశ్ నార్త్ కరోలినాలో నివశిస్తున్నారు. ర్యాలిష్‌లోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. ముఖేశ్ దేశ్‌ముఖ్, ఆయన భార్య మౌనిక, కూతురు మూడేళ్ల దివిజ కారులో వెళుతుండగా విల్లింగ్‌టన్‌కు 70 మైళ్ల దూరంలో ప్రమాదం చోటుచేసుకుంది. వీరు కారు ఒక ట్రాక్కును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముఖేశ్‌తో పాటు కూతురు దివిజ అక్కడికక్కడే మరణించారు. మౌనిక తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. ముఖేశ్ ఆయన కూతురి మరణం స్థానిక ప్రవాస భారతీయులను కలిచివేసింది. శుక్రవారం దివిజ మూడో పుట్టినరోజు కావడంతో ఈ ఘటనను తలచుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.