Food Crisis: అన్నమో రామచంద్రా..! ప్రపంచ వ్యాప్తంగా ఆకలి కష్టాలు.. భవిష్యత్తు పరిస్థితి ఏమిటంటే..

ప్రపంచ వ్యాప్తంగా ఆకలి బాధలు ఎక్కువ అవుతున్నాయి. భవిష్యత్తుల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుదన్న నివేదికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది తిండి కోసం అలమటిస్తుండగా..

Food Crisis: అన్నమో రామచంద్రా..! ప్రపంచ వ్యాప్తంగా ఆకలి కష్టాలు.. భవిష్యత్తు పరిస్థితి ఏమిటంటే..
Food Crisis
Follow us

|

Updated on: Aug 28, 2022 | 9:58 AM

Food Crisis: ప్రపంచ వ్యాప్తంగా ఆకలి బాధలు ఎక్కువ అవుతున్నాయి. భవిష్యత్తుల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుదన్న నివేదికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది తిండి కోసం అలమటిస్తుండగా.. కరవుతో జనం కొట్టిమిట్టాడుతున్నారు. ప్రపంచంలో ఆకలి కేకలపై ఐక్యరాజ్యసమితికి చెందిన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్- WFP తాజాగా ఓ నివేదిక విడుదల చేసింంది. దీని ప్రకారం విశ్వ వ్యాప్తంగా 8 కోట్ల 28 లక్షల మంది ప్రజలు ఆకలితోనే నిద్ర పోతున్నారు.. 45 దేశాలల్లోని 50 లక్షల మంది జనం కరువుతో కొట్టు మిట్టాడుతున్నారు. ఇళ్లూ, వస్త్రాలు లేకున్నా జీవించడానికి ఆహారం అత్యంత అవసరం. కానీ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది జనం ఆకలి కేకలతో అలమటించిపోతున్నారు.

ఆహార కొరతను ఎదుర్కొంటున్న జనాభా గత మూడేళ్లతో పోలిస్తే 50 శాతం పెరిగి సుమారు 345 మిలియన్లకు చేరుకుంది.. గత మూడేళ్లుగా ఈ సమస్య మరింత తీవ్రగా మారిపోయిందని యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ నివేదిక చెబుతోంది. వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి, పెరుగుతున్న అసమానతల కారణంగా ఈ సమస్య ఏర్పడిందని పేర్కొంది. ఇదే సమయంలో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన యుద్ధం సమస్యను మరింత సంక్లిష్టంగా మార్చేసింది. అమెరికాతో పాటు యూరోప్‌ దేశాలు రష్యా మీద విధించిన ఆంక్షల కారణంగా పలు దేశాలకు గోధుమలు, బియ్యం సరఫరా నిలిచిపోయింది.

కరోనా మహమ్మారికి ముందు ప్రపంచ వ్యాప్తంగా ఒక కోటి 35 లక్షల మంది ప్రజలు ఆహార కొరతను ఎదుర్కొంటే, ఈ సంఖ్య ఇప్పుడు ఎన్నోరెట్లు పెరిగిపోయింది.. ప్రతి రాత్రి 8 కోట్ల 28 లక్షల మంది ప్రజలు ఆకలితోనే నిద్రలోకి జారుకొని రోజును ముగిస్తున్నారు.. ప్రపంచ వ్యాప్తంగా 45 దేశాల్లోని 50 లక్షల మంది ప్రజలు కరువు కోరల్లో చిక్కుకున్నారు. అనేక దేశాల్లో ఎరువులు, ఇంధన ధరలు పెరగడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆసియా, ఆఫ్రికా, అమెరికా వంటి దేశాల్లో పంటలు దెబ్బతింటాయని WFP అధికారులు చెబుతున్నారు. పరిస్థితులు రోజు రోజుకీ మరింతగా దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిడిల్‌ ఈస్ట్‌-నార్త్‌ ఆఫ్రికా దేశాల్లో ఆహార భద్రత పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా 2022 చివరి నాటికి మరిన్ని కరవు కాటకాలు సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. 2023లో కూడా ఈఆకలి కేకల సమస్య మరింత ఘోరంగా ఉండొచ్చని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ నివేదిక హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!