AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Britain Visa: వారి కలయికతో యువతకు కలిసి వచ్చే ప్రకటన.. కీలక నిర్ణయం తీసుకున్న బ్రిటన్ ప్రభుత్వం

భారత ప్రధాని నరేంద్ర మోదీ, భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కలయిక.. మన దేశస్థులకు, భారత సంతతివారికి చాలా..

Britain Visa: వారి కలయికతో యువతకు కలిసి వచ్చే ప్రకటన.. కీలక నిర్ణయం తీసుకున్న బ్రిటన్ ప్రభుత్వం
Modi And Sunak
శివలీల గోపి తుల్వా
|

Updated on: Nov 17, 2022 | 2:35 PM

Share

భారత ప్రధాని నరేంద్ర మోదీ, భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కలయిక.. మన దేశస్థులకు, భారత సంతతివారికి చాలా సంతోషకరమైనదిగా మారింది. అయితే వారి కలయిక మరికొన్ని పరిణామాలకు దారితీసింది. అది నిజంగా మన దేశంలోని యువకులకు సంతోషకరమైన విషయం. ఏమిటంటే.. ఇరు దేశాల ప్రధానులు కలిసిన కొన్ని గంటలకే భారత యువ నిపుణులకు ప్రతి ఏటా 3,000 వీసాలను అందించే విధంగా బ్రిటన్ ప్రభుత్వం అమోదించింది. బ్రిటన్ ప్రధాని అధికార కార్యాలయం 10 డౌనింగ్ స్ట్రీట్ నుంచి విడుదల అయిన ప్రకటన ప్రకారం.. 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల భారతీయ గ్రాడ్యుమేట్లకు వృత్తి, సాంస్కృతిక మార్పులలో పాలు పంచుకునేందుకు జీవితకాలంలో ఒకసారి అవకాశం లభిస్తుంది. ఇది 2023 నుంచి అమలులోకి వస్తుంది. ఇలాంటి వీసా సదుపాయం పొందిన మొదటి దేశం మనదే కావడంతో మరింత విశిష్టతను సంతరించుకుంది.

ఇండోనేషియా రాజధాని బాలిలో జరిగిన జీ20 సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోదీ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కలయిక జరిగిన కొన్ని గంటల సమయంలోనే ఈ ప్రకటన విడుదలయింది. గత నెలలో సునాక్ బ్రిటన్ ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే వారి మొదటి సమావేశం. కలయిక గురించి “బాలీలో జరుగుతున్న జీ20 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రులు మోదీ, సునాక్ సంభాషించుకుంటున్నారు’’ అని భారత ప్రధాని కార్యాలయం ట్వీట్‌ చేసింది. సునాక్ కూడా ఓ ప్రకటనలో “మన భద్రత, మన శ్రేయస్సు కోసం ఇండో-పసిఫిక్ సత్సంబంధాలు చాలా కీలకమైనదవి. భారతదేశంతో మనకున్న లోతైన సాంస్కృతిక, చారిత్రక సంబంధాల విలువ నాకు ప్రత్యక్షంగా తెలుసు. భారతదేశం ప్రకాశవంతమైన యువకులలో, ఇంకా ఎక్కువ మంది బ్రిటన్‌లో అవకాశాన్ని పొందగలరని నేను సంతోషిస్తున్నాను’’ అని అన్నారు.

కాగా, బ్రిటన్ వలస జనాభాలో భారతీయ మూలాలున్న వారు అధిక భాగం, అంతర్జాతీయ విద్యార్థులలో దాదాపు నాలుగింట ఒక వంతు మంది ఈ దేశానికి చెందినవారే. బ్రిటన్ ప్రస్తుతం భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతోంది. ఒక వేళ అవి సఫలమయితే..ఒక యూరోపియన్ దేశంతో భారత్ చేసుకున్న మొదటి ఒప్పందం అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ప్రపంచ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి..

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై