Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tea Price: ఓరి దేవుడో.. కిలో టీ పొడి ధర 1600 రూపాయలు..! కప్పు ఛాయ్‌ ఎంతో మరీ..?

పోర్టుకు వచ్చిన టీ పొడిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో దేశంలో టీపొడి కొరత ఏర్పడిందని వ్యాపారులు తెలిపారు.

Tea Price: ఓరి దేవుడో.. కిలో టీ పొడి ధర 1600 రూపాయలు..! కప్పు ఛాయ్‌ ఎంతో మరీ..?
Tea Powder
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 13, 2023 | 8:09 AM

పాకిస్తాన్‌ అనూహ్యమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళుతున్న తరుణంలో, నగదు తీవ్రంగా ఉంది. ఈ క్రమంలోనే దేశంలో బ్లాక్ టీ ధర కూడా చుక్కలంటుతోంది. గత 15 రోజుల్లో కిలో టీ పౌడర్‌ ధర రూ. 1,100 నుండి రూ. 1,600కి పెరిగింది. ఎందుకంటే దాదాపు 250 కంటైనర్లు ఇప్పటికీ అక్కడ నిలిచిపోయాయి. పోర్ట్‌లో నిలిచిపోయిన టీ పొడి త్వరలో మార్కెట్‌కు రాకపోతే రంజాన్ నాటికి రూ.2500కి చేరే అవకాశం ఉందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. డిసెంబర్ 2022 చివరి నుండి జనవరి ప్రారంభం వరకు ఇదే విధంగా కొనసాగుతూ వచ్చింది.

విదేశీ మారకద్రవ్య సేకరణ ఖాళీగా ఉండటంతో పాకిస్థాన్ ప్రభుత్వం విదేశాల నుంచి నిత్యావసర వస్తువులను మాత్రమే దిగుమతి చేసుకుంటోంది. తద్వారా టీ పొడి కూడా తనదైన ముద్ర వేసింది. మరోవైపు ఇప్పటికే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న టీ కొనుగోళ్లు, ఓడరేవు లోనూ వ్యాపారులకు పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే టీ కొనుగోలుకు చెల్లించాల్సిన డబ్బు వచ్చే 180 రోజులకు డాలర్ రూపంలో చెల్లించాలి. 6 నెలల తర్వాత, డాలర్‌తో పోలిస్తే పాకిస్తాన్ రూపాయి విలువ మరింత క్షీణించవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోర్టుకు వచ్చిన టీ పొడిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో దేశంలో టీపొడి కొరత ఏర్పడిందని వ్యాపారులు తెలిపారు.

గత నెలలో పాకిస్థాన్‌లో కిలో గోధుమ పిండి ధర రూ.500 నుంచి రూ.1000కి చేరింది. మరోవైపు చికెన్ ధర కేవలం నెల రోజుల్లోనే రూ.300 పెరిగి కిలో రూ.700కి చేరింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..