AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accident : ఇరుకైన రహదారిలో వెయ్యి మీటర్లకు పైగా లోతైన లోయలోకి దూసుకెళ్లిన వ్యాన్‌.. 22మంది మృతి

కొండ ప్రాంతంలోని ఇరుకైన రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ ప్యాసింజర్‌ వ్యాన్‌ వంద అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 22 మంది మృత్యువాతపడ్డారు. జోబ్‌ నేషనల్‌ హైవేపై ఖిల్లా సైఫుల్లాకు సమీపంలో..

Road Accident : ఇరుకైన రహదారిలో వెయ్యి మీటర్లకు పైగా లోతైన లోయలోకి దూసుకెళ్లిన వ్యాన్‌.. 22మంది మృతి
Jyothi Gadda
|

Updated on: Jun 08, 2022 | 8:25 PM

Share

పాకిస్థాన్​లో ఘోర ప్రమాదం జరిగింది. కొండ ప్రాంతంలోని ఇరుకైన రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ ప్యాసింజర్‌ వ్యాన్‌ వంద అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 22 మంది మృత్యువాతపడ్డారు. జోబ్‌ నేషనల్‌ హైవేపై ఖిల్లా సైఫుల్లాకు సమీపంలో ప్రమాదం జరిగినట్లు పాక్‌ పత్రిక డాన్‌ పేర్కొంది. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌లో 23 మంది ఉన్నారని, ఇందులో 22 మంది మరణించినట్లు పేర్కొంది.ఈ ప్రమాదం నుండి ఓ చిన్నారి తీవ్రంగా గాయపడి, ప్రాణాలతో బయటపడ్డట్లు పేర్కొంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

బుధవారం ఉదయం 23 మందితో వ్యాన్‌ జోబ్‌కు వెళ్తున్న సమయంలో.. అక్తర్‌ జాయ్‌ సమీపంలో కొండపై నుంచి అదుపుతప్పి వ్యాన్‌ లోయలో పడిపోయిందని జిల్లా డిప్యూటీ కమిషనర్‌ హఫీజ్‌ ముహమ్మద్‌ ఖాసిం తెలిపారు. వ్యాన్‌ అదుపుతప్పి 1,572 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ప్రమాదంలో చిన్నారి బాలుడు మాత్రం గాయాలతో బయటపడ్డాడని తెలిపారు.చికిత్స కోసం బాలుడిని క్వెట్టాకు తరలించినట్లు చెప్పారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు, ఐదుగురు మహిళలు సహా మొత్తం 22మంది మరణించినట్టు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనపై పాక్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు తగిన వైద్యం అందించాలని అధికారులను కోరారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి సంవత్సరం,ఇక్కడి ప్రమాదకర కొండ ప్రాంతాల కారణంగా బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వందల మంది ప్రజల ప్రాణాలను ఇక్కడి రహదారులు బలిగొంటున్నాయి.