Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

27 మృతదేహాలు వెలికితీత..! మృతుల సంఖ్య పెరిగే అవకాశం.. ఎక్కడంటే..?

కరాచీలోని ఒక పాత ఐదు అంతస్తుల భవనం కూలిపోవడంతో 27 మంది మరణించారు. రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. మృతులలో చాలామంది మహిళలు, పిల్లలు ఉన్నారు. భవనం ముందుగానే శిథిలావస్థలో ఉందని గుర్తించబడింది. దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు. భారీ యంత్రాలను ఉపయోగించి శిథిలాలను తొలగిస్తున్నారు.

27 మృతదేహాలు వెలికితీత..! మృతుల సంఖ్య పెరిగే అవకాశం.. ఎక్కడంటే..?
Karachi Building Collapse
SN Pasha
|

Updated on: Jul 06, 2025 | 7:24 PM

Share

కరాచీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పాకిస్తాన్ దక్షిణ ఓడరేవు నగరం కరాచీలో భవనం కుప్ప కూలడంతో 27 మరణించారు. ప్రస్తుతం రెస్క్యూ ఆఫరేషన్‌ కొనసాగుతోంది. శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉన్నట్లు సమాచారం. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న ప్రతినిధి హసన్ ఉల్ హసీబ్ ఖాన్ మాట్లాడుతూ.. సహాయక చర్యలు చివరి దశలో ఉన్నాయని, చాలా భవన శిథిలాలను తొలగించామని చెప్పారు. మృతుల్లో కనీసం 15 మంది మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నారని, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఆయన అన్నారు.

48 గంటలకు పైగా కొనసాగిన ఈ ఆపరేషన్‌లో శిథిలాలను తొలగించడానికి భారీ యంత్రాలు, ఆధునిక పరికరాలను ఉపయోగించినట్లు తెలుస్తోంది. స్థానిక అధికారుల ప్రకారం.. కూలిపోయిన నిర్మాణం 30 సంవత్సరాల నాటిది, గతంలో దీనిని సురక్షితం కాదని గుర్తించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ దక్షిణ ఓడరేవు నగరం కరాచీలో శుక్రవారం ఐదు అంతస్తుల నివాస భవనం కూలిపోయి ఏడుగురు మృతి చెందగా, కనీసం 10 మంది గాయపడ్డారని పోలీసు అధికారులు జూలై 4న తెలిపారు.

కరాచీలోని లియారి ప్రాంతంలో భవనం కూలిపోయిన తరువాత 30 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నారని, మిగిలిన వ్యక్తులను వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆ ప్రాంత పోలీసు అధికారులు తెలిపారు. శిథిలావస్థలో ఉన్న భవనం శిథిలాలను తొలగించడంలో సహాయపడటానికి భారీ యంత్రాలను ఉపయోగిస్తున్నామని, అధికారులు ఇప్పటికే దీనిని సురక్షితం కాదని గుర్తించారు, ముందు జాగ్రత్త చర్యగా పక్కనే ఉన్న రెండు భవనాలను కూడా ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. భూకంపంగా నివాసితులు భావించిన అనేక ప్రకంపనల తర్వాత భవనం కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రెండు గంటల పాటు అడపాదడపా ప్రకంపనలు వచ్చిన తర్వాత భవనం అకస్మాత్తుగా కూలిపోయిందని వారు తెలిపారు. ఈ సంఘటన తర్వాత, అధికారులు ఆ ప్రాంతాన్ని చేరుకున్నారు. బాధితులందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి