AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌ – పాక్‌ మధ్య సీజ్‌ఫైర్‌.. మరోసారి స్పందించిన ట్రంప్‌! ఆ విషయం రెండు దేశాలకు అర్థమైంది!

ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ చారిత్రక నిర్ణయంతో యుద్ధం నివారించబడింది. ట్రంప్ రెండు దేశాల నాయకత్వాన్ని కొనియాడారు మరియు భవిష్యత్తులో వాణిజ్య సంబంధాలను మెరుగుపరచాలని ఆశించారు.

భారత్‌ - పాక్‌ మధ్య సీజ్‌ఫైర్‌.. మరోసారి స్పందించిన ట్రంప్‌! ఆ విషయం రెండు దేశాలకు అర్థమైంది!
Donald Trump
Follow us
SN Pasha

|

Updated on: May 11, 2025 | 10:24 AM

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు అమెరికా మధ్యవర్తిత్వంతో తగ్గాయి. ప్రస్తుతం ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. భారత్‌, పాక్‌ మధ్య ఇప్పుడు సీజ్‌ఫైర్‌ ఉంది. అంటే ఎవరు కాల్పులు జరపకూడదు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శనివారం సాయంత్రం వెల్లడించారు. ఆ తర్వాత ఇరు దేశాలు కూడా కాల్పుల విరమణ గురించి ప్రకటించాయి. అయితే తాజాగా ట్రంప్‌ మరోసారి ఈ విషయంపై స్పందించారు. యుద్ధం సృష్టించే విధ్వంసాన్ని రెండు దేశాలు అర్థం చేసుకున్నాయని ట్రంప్‌ అన్నారు. రెండు దేశాల్లో శక్తిమంతమైన, అచంచలమైన నాయకత్వాలున్నాయని పేర్కొన్నారు. అయితే ఇలాంటి చారిత్రక నిర్ణయంలో అమెరికా సాయపడటం గర్వంగా ఉందన్న ట్రంప్‌ అన్నారు. రెండు దేశాలతో వాణిజ్యం పెంచుకుంటామని కూడా ఈ సందర్భంగా ట్రంప్‌ ప్రకటించించడం విశేషం. రెండు దేశాల నాయకత్వాలు గొప్ప పనిచేశాయని ట్రంప్ కితాబిచ్చారు.

ఏప్రిల్‌ 22న జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని చంపేశారు. దాంతో భారత ప్రభుత్వం ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టి పాకిస్తాన్‌, పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసింది. ఆ తర్వాత ప్రతీకారం అంటూ పాకిస్థాన్‌ కూడా భారత్‌పై సైనిక చర్యకు దిగంది. సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడుతూ, సాధారణ పౌరులు, సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడికి తెగబడింది. భారత్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ వాటిని అడ్డుకోవడంతో పాటు పాక్‌పై ప్రతిదాడి చేసింది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. పరిస్థితి మరింత తీవ్రమవుతున్న క్రమంలో అమెరికా జోక్యం చేసుకొని కాల్పుల విరమణకు రెండు దేశాలను ఒప్పించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి