ఆరోగ్యం కోసం జ్యూస్ను ఇంజక్షన్ చేసుకున్న మహిళ
చైనాకు చెందిన జెంగ్ అనే 51 ఏళ్ల మహిళకు నిత్యం పండ్ల రసాలను తాగడం అలవాటు చేసుకుంది. అయితే, పండ్ల రసం నేరుగా శరీరానికి వెళ్తుందా లేదా అనే అనుమానంతో వాటిని ఇంజక్షన్ చేసుకోవాలని ఆలోచించింది. ఈ సందర్భంగా 20 రకాల పండ్లను జ్యూస్ చేసి, వడపోసింది. ఆ రసాన్ని సిరెంజీలోకి ఎక్కించుకుని ఇంజక్షన్ చేసుకుంది. కొన్ని గంటల తర్వాత ఆమె శరీరం దురద పెట్టడం, అనంతరం తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురైంది. దీంతో ఆమె భర్త […]

చైనాకు చెందిన జెంగ్ అనే 51 ఏళ్ల మహిళకు నిత్యం పండ్ల రసాలను తాగడం అలవాటు చేసుకుంది. అయితే, పండ్ల రసం నేరుగా శరీరానికి వెళ్తుందా లేదా అనే అనుమానంతో వాటిని ఇంజక్షన్ చేసుకోవాలని ఆలోచించింది. ఈ సందర్భంగా 20 రకాల పండ్లను జ్యూస్ చేసి, వడపోసింది. ఆ రసాన్ని సిరెంజీలోకి ఎక్కించుకుని ఇంజక్షన్ చేసుకుంది. కొన్ని గంటల తర్వాత ఆమె శరీరం దురద పెట్టడం, అనంతరం తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురైంది. దీంతో ఆమె భర్త వెంటనే ఆసుపత్రిలో చేర్చడంతో ప్రాణాపాయం నుండి తప్పించుకుంది. ఇంజక్షన్ వల్ల ఆమె కాలేయం, మూత్రపిండాలు, గుండె, ఊపిరితీత్తులు దెబ్బతిన్నాయన్నారు అక్కడి వైద్యులు. ఐదు రోజులపాటు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఈ ఘటన చైనా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. #OldWomanPutsJuiceIntoVeins అనే హ్యాష్ట్యాగ్తో ట్రెండవుతోంది.
https://twitter.com/babaagbajelola/status/1108213181275623424