AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AFG: ఆఖరి వన్డేకు టీమిండియాలో కీలక మార్పు.. ఎవరు ఎంట్రీ ఇచ్చారో తెలుసా..?

India vs Afghanistan 3rd ODI: సిరీస్ విజయం దక్కినప్పటికీ ప్రయోగాలకు తావులేకుండా పక్కా ప్రణాళికతో ఆఫ్ఘనిస్తాన్‌ను కట్టడి చేయాలని భారత్ భావిస్తోంది. మరి ఆకాష్ చోప్రా సూచించినట్లుగా యువ రక్తం నితీష్ రెడ్డికి అవకాశం ఇచ్చి, అర్ష్‌దీప్‌కు విశ్రాంతిని ఇస్తారా లేదా అనేది శనివారం టాస్ పడే సమయానికి తేలనుంది.

IND vs AFG: ఆఖరి వన్డేకు టీమిండియాలో కీలక మార్పు.. ఎవరు ఎంట్రీ ఇచ్చారో తెలుసా..?
Ind Vs Afg
Venkata Chari
|

Updated on: Jun 20, 2026 | 7:10 AM

Share

India vs Afghanistan 3rd ODI: ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే ఆఖరి వన్డేకు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్, క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ఈ తరుణంలో మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఎంపిక చేసిన ప్లేయింగ్ ఎలెవన్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌కు ఆయన చోటు నిరాకరించడం గమనార్హం.

క్లీన్‌స్వీపే లక్ష్యంగా భారత్ వ్యూహాలు..

భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య శనివారం (జూన్ 20) జరగబోయే మూడో వన్డే మ్యాచ్ కేవలం నామమాత్రమే. ఎందుకంటే తొలి రెండు వన్డేల్లోనూ ఘన విజయాలు సాధించిన టీమిండియా 2-0తో అప్పుడే సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది. అయితే మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకపోయినా, శత్రువును క్లీన్‌స్వీప్ చేసి సిరీస్‌ను 3-0తో ముగించాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. మరోవైపు దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత యువ పేసర్ హర్షిత్ రాణా జట్టులోకి తిరిగి రావడం అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ నేపథ్యంలో ఆఖరి పోరుకు బరిలోకి దిగే తుది జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అర్ష్‌దీప్‌ సింగ్‌ను ఎందుకు పక్కనబెట్టారు?

క్రికెట్ విశ్లేషణల్లో తనదైన ముద్ర వేసిన మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్ వేదికగా భారత్ తుది జట్టును అంచనా వేశారు. ఇందులో ఆయన అందరినీ విస్మయానికి గురిచేస్తూ లైనప్ నుండి అర్ష్‌దీప్ సింగ్‌ను పక్కనపెట్టి, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. దీనికి గల కారణాన్ని వివరిస్తూ, నితీష్ కుమార్ రెడ్డి జట్టులోకి వస్తే భారత్‌కు అదనపు బౌలర్ అవసరం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. నితీష్ చేతనే పూర్తి 10 ఓవర్ల కోటాను బౌలింగ్ చేయించాలని సూచించారు. మన టాప్ సిక్స్ బ్యాటర్లలో ఎవరూ బౌలింగ్ చేయరని, అందుకే ఐదుగురు పూర్తిస్థాయి బౌలర్ల కంటే, నితీష్ లాంటి ఆల్‌రౌండర్‌తో సాగడమే ఉత్తమమని చోప్రా స్పష్టం చేశారు.

చోప్రా ఎంచుకున్న బలమైన బ్యాటింగ్ లైనప్..

ఆకాష్ చోప్రా తన అంచనా జట్టులో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్‌లను ఎంపిక చేశారు. గత మ్యాచ్‌లో మూడో స్థానంలో వచ్చి అద్భుత శతకంతో కదంతొక్కిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను ఈసారి కూడా అదే స్థానంలో ఆడించాలని చెప్పారు. ఆ తర్వాత మిడిలార్డర్ బాధ్యతలను ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లకు అప్పగించారు. ఈ ముగ్గురు బ్యాటర్లు ఇన్నింగ్స్‌ను నిలబెట్టడంతో పాటు స్కోరు బోర్డును పరుగెత్తించగలరని నమ్మకం వ్యక్తం చేశారు.

ఆల్‌రౌండర్లు, బౌలింగ్ విభాగం ఇదే..

జట్టులో సమతూకం కోసం నితీష్ కుమార్ రెడ్డితో పాటు వాషింగ్టన్ సుందర్‌ను ఆల్‌రౌండర్లుగా 7, 8 స్థానాల్లో చోప్రా ఎంపిక చేశారు. ఇక స్పిన్ విభాగంలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ప్రధాన అస్త్రంగా ఉండగా, అతనికి తోడుగా పేస్ బౌలింగ్ బాధ్యతలను గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్‌లు పంచుకోనున్నారు. ఈ వ్యూహం జట్టుకు బ్యాటింగ్ లోతును ఇవ్వడమే కాకుండా బౌలింగ్‌లోనూ వైవిధ్యాన్ని తెస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఆకాష్ చోప్రా అంచనా వేసిన భారత తుది జట్టు: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us