AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌: పోలింగ్‌కు ముందే రణరంగం.. భయాందోళనలో జనం!

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఎన్నికల వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండో దశ పోలింగ్‌కు ముందు నిరసనకారులు, భద్రతా దళాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో ముజఫరాబాద్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హింసాత్మక ఘటనలతో ఎన్నికల ప్రక్రియపై ప్రభావం పడుతుందనే ఆందోళనను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌: పోలింగ్‌కు ముందే రణరంగం.. భయాందోళనలో జనం!
Pok Violence Erupts
Balaraju Goud
|

Updated on: Aug 02, 2026 | 12:19 PM

Share

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఎన్నికల వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండో దశ పోలింగ్‌కు ముందు నిరసనకారులు, భద్రతా దళాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో ముజఫరాబాద్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హింసాత్మక ఘటనలతో ఎన్నికల ప్రక్రియపై ప్రభావం పడుతుందనే ఆందోళనను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫరాబాద్ ప్రాంతంలో ఎన్నికల నేపథ్యంలో భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. మూడు దశల్లో జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఆగస్టు 2న ఆదివారం రెండో దశ పోలింగ్ జరగనున్న వేళ, పలుచోట్ల నిరసనలు, ఘర్షణలు చోటుచేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

స్థానికుల కథనం ప్రకారం, పోలింగ్‌కు ముందు నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. అనంతరం కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. శనివారం (ఆగస్టు 01) ముజఫరాబాద్‌లో తగలబెట్టిన వాహనాలు, రోడ్లపై చెల్లాచెదురుగా పడి ఉన్న రాళ్లు, భారీగా మోహరించిన భద్రతా బలగాలు పరిస్థితి తీవ్రతను ప్రతిబింబించాయి. హింసాత్మక ఘటనల కారణంగా ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని, ఎన్నికల నిర్వహణపై కూడా ప్రభావం పడవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భద్రతా బలగాలు ముజఫరాబాద్‌లో విస్తృతంగా గస్తీ నిర్వహిస్తున్నాయి. సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా పెంచారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఘర్షణలకు సంబంధించిన పూర్తి వివరాలు, గాయపడిన వారి సంఖ్య లేదా ఇతర అధికారిక సమాచారం ఇంకా వెల్లడికాలేదు. పరిస్థితిపై పాకిస్థాన్ అధికారులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు.

ఎన్నికల సమయంలో హింసకు తావులేకుండా శాంతియుత వాతావరణంలో పోలింగ్ జరగాలని స్థానికులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు అక్కడి ఎన్నికల నిర్వహణపై, ప్రజల భాగస్వామ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us