AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కమ్మని రొయ్యల పులుసు.. మసాలాలు లేకుండా ఎలా చేయాలంటే?

రొయ్యల పులుసు అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా రొయ్యల పులుసు తింటారు. కాగా, దీనిని మసాలాలు లేకుండా చాలా రుచికరంగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇంట్లోనే సులభంగా ఇలా చేస్తే రుచి అదిరిపోతుందంట.

Samatha J
|

Updated on: Jun 19, 2026 | 9:37 PM

Share
కావాల్సిన పదార్థాలు : రొయ్యలు కేజీ,  పచ్చి మిర్చి , ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తి మీర తరుగు, జీలకర్ర పొడి, ఆవాలు, జీడిపప్పు, నూనె, ఉప్పు, కారం, పసుపు, చింత పండు నిమ్మకాయ సైజు, కొత్తిమీర తరుగు, మెంతి ఆకు.

కావాల్సిన పదార్థాలు : రొయ్యలు కేజీ, పచ్చి మిర్చి , ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తి మీర తరుగు, జీలకర్ర పొడి, ఆవాలు, జీడిపప్పు, నూనె, ఉప్పు, కారం, పసుపు, చింత పండు నిమ్మకాయ సైజు, కొత్తిమీర తరుగు, మెంతి ఆకు.

1 / 5
తయారీ విధానం :  ముందుగా రొయ్యలు తీసుకొని వాటిని గోరు వెచ్చటి నీటిలో వేసుకొని, శుభ్రంగా కడగాలి.  తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రొయ్యలకు ఉప్పు కారం,  అన్నీ కలిపి పక్కన పెట్టుకోవాలి.

తయారీ విధానం : ముందుగా రొయ్యలు తీసుకొని వాటిని గోరు వెచ్చటి నీటిలో వేసుకొని, శుభ్రంగా కడగాలి. తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రొయ్యలకు ఉప్పు కారం, అన్నీ కలిపి పక్కన పెట్టుకోవాలి.

2 / 5
ఇప్పుడు కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి. అందులో ఆవాలు,జీలకర్ర, కరివేపాకు వేసి మంచి చిట పటమనిపించుకోవాలి. అలాగే లవంగాలు, జీడిపప్పు, షాజీరా అన్నీ వేసి  మంచిగా వేయించుకోవాలి. ఇవి అన్ని విధాలుగా మేలు చేస్తుంది.

ఇప్పుడు కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి. అందులో ఆవాలు,జీలకర్ర, కరివేపాకు వేసి మంచి చిట పటమనిపించుకోవాలి. అలాగే లవంగాలు, జీడిపప్పు, షాజీరా అన్నీ వేసి మంచిగా వేయించుకోవాలి. ఇవి అన్ని విధాలుగా మేలు చేస్తుంది.

3 / 5
పోపు మంచిగా వేయించిన తర్వాత అందులో చింత పండు రసం వేసుకోవాలి. చింతపండు రసం బాగా మరిగే సమయంలో కొంచెం పచ్చి అల్లం దంచి, వెల్లుల్లి వేసి మంచిగా దంచుకోవాలి. పులుసు బాగా మరిగే సమయంలో రొయ్యలను అందులో వేసుకోవాలి.

పోపు మంచిగా వేయించిన తర్వాత అందులో చింత పండు రసం వేసుకోవాలి. చింతపండు రసం బాగా మరిగే సమయంలో కొంచెం పచ్చి అల్లం దంచి, వెల్లుల్లి వేసి మంచిగా దంచుకోవాలి. పులుసు బాగా మరిగే సమయంలో రొయ్యలను అందులో వేసుకోవాలి.

4 / 5
రొయ్యలు మెత్తగా ఉడికి బాగా మరగనివ్వాలి. పులుసు మంచిగా మరిగే సమయంలో అందులో కొత్తిమీర, పూదీనా వేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ  రొయ్యల పులుసు రెడీ.

రొయ్యలు మెత్తగా ఉడికి బాగా మరగనివ్వాలి. పులుసు మంచిగా మరిగే సమయంలో అందులో కొత్తిమీర, పూదీనా వేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ రొయ్యల పులుసు రెడీ.

5 / 5
Follow Us