Vaccination: వ్యాక్సిన్ వేసుకోవడానికి నిరాకరిస్తే జైలుకే.. లేదా దేశం విడిచి వెళ్లిపోవాల్సిందే .. ఎక్కడో తెలుసా?

Vaccination: వ్యాక్సినేషన్ కు వ్యతిరేకిస్తున్న ప్రజలకు ఆ దేశ అధ్యక్షుడు హెచ్చరికలు జారీ చేశారు. టీకా నిరాకరిస్తే జైలుకైనా పోవాలి లేదా దేశం విడిచి వెళ్ళిపోవాలని చెప్పారు.

Vaccination: వ్యాక్సిన్ వేసుకోవడానికి నిరాకరిస్తే జైలుకే.. లేదా దేశం విడిచి వెళ్లిపోవాల్సిందే .. ఎక్కడో తెలుసా?
Vaccination
Follow us

|

Updated on: Jun 23, 2021 | 8:38 PM

Vaccination: ఏకపక్షంగా ఆదేశాలు ఇవ్వడంలో ప్రసిద్ధి చెందిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే ఇలాంటి మరో ఉత్తర్వు ఇచ్చారు. దేశంలోని ఏ పౌరుడైనా కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకోవడానికి నిరాకరిస్తే, అతన్ని జైలుకు పంపిస్తామని డ్యూటెర్టే చెప్పారు. వ్యాక్సిన్ పొందడంలో నిర్లక్ష్యాన్ని అస్సలు సహించలేమని ఆయన అంటున్నారు. ఎందుకంటే, అలా చేసేవారు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ఇది దేశానికి నష్టాన్ని కలిగిస్తుంది అంటూ ఉత్తర్వులు ఇచ్చే సమయంలో ఆయన వ్యాఖ్యానించారు. గతంలో కూడా ఆయన లాక్డౌన్లో అనవసరంగా తిరుగుతున్న వారిని పోలీసులు లేదా సైన్యం కాల్చివేయవచ్చని ప్రకటించారు. గతేడాది కోవిడ్ -19 మొదటి వేవ్ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. దీంతో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. జాతీయ అత్యవసర పరిస్థితిని జాగ్రత్తగా చూసుకోండి..

నేషనల్ టీవీలో ఒక కార్యక్రమంలో, డ్యూటెర్టే మాట్లాడుతూ – ”మన దేశం ఈ సమయంలో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇది జాతీయ అత్యవసర పరిస్థితి అని ప్రజలు అర్థం చేసుకోవాలి. మీరు టీకా తీసుకోవడానికి ముందుకు రాకపోతే నేను మిమ్మల్ని అరెస్టు చేస్తానని స్పష్టమైన మాటల్లో చెబుతున్నాను. ఇలా మ్నిమ్మల్ను జైలుకు పంపించేలా నన్ను బలవంతం చేయవద్దు. ఎవరైనా జైలుకు వెళ్లాలని నేను అనుకోను.” అన్నారు. టీకా గురించి ఆయన ఇప్పటికే ప్రజలను హెచ్చరించారు. కొంతమంది టీకా గురించి గందరగోళం వ్యక్తం చేస్తున్నారని, దీనివల్ల చాలా మందికి వ్యాక్సిన్ రావడం లేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల తన నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక తర్వాతే డ్యూటెర్టే ఈ హెచ్చరిక చేశారు.

దేశం విడిచి వెళ్ళండి..

డ్యూటెర్టే ఆ ప్రకటనలో ఇంకా ఇలా అన్నారు – ”టీకా పొందడంలో కొంతమందికి సమస్య ఉంటే, వారు దేశం విడిచి వెళ్ళాలి. కొంతమంది టీకా గురించి తప్పుడు విషయాలు, పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు.” అని ఆయన అన్నారు. ఈ వ్యక్తులపై ప్రభుత్వ సంస్థలు కూడా చర్యలు తీసుకుంటాయి. అయితే, టీకాలు వేయని వారిని జైలుకు పంపిస్తామని బెదిరించడం కూడా కొంతమంది దృష్టికి రాలేదు. దేశంలోని ప్రసిద్ధ న్యాయవాది ఆడ్రే ఒల్లాలియా మాట్లాడుతూ – ”దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఉన్నప్పటికీ, టీకా తీసుకోకపోవడం వల్ల ఎవరినైనా జైలుకు పంపే హక్కు ప్రెసిడెంట్ కు లేదు.”

ఫిలిప్పీన్స్‌లో సోమవారం 5429 కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం సోకిన వారి సంఖ్య 13 లక్షలు దాటింది. ఫైజర్ వ్యాక్సిన్‌ను ప్రభుత్వం సుమారు 4 కోట్ల మోతాదులో కొనుగోలు చేసింది. ఇందులో 1.27 కోట్ల మోతాదు ఇప్పటికే దేశానికి చేరుకుంది.

Also Read: Corona Vaccine: శుభవార్త చెప్పిన శాస్త్రవేత్తలు..కరోనా వైరస్ పనిపట్టే సూపర్ వ్యాక్సిన్ రెడీ..అన్ని వేరియంట్లకూ చెక్!

Covid-19 Vaccine: కొవిడ్ వ్యాక్సిన్లు రక్షణ కవచాలే.. తాజా అధ్యయనంలో తేలిన ఆసక్తికర విషయాలు

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు