AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan Airstrike: ఆఫ్ఘనిస్థాన్‌లో మళ్లీ వైమానిక దాడి..ఏడుగురు తాలిబాన్ ఉగ్రవాదుల హతం

ఆప్ఘ‌నిస్థాన్‌లో మ‌ళ్లీ వైమానిక దాడి చోటు చేసుకుంది. ఆప్ఘ‌నిస్థాన్ బాల్ఖు ప్రావిన్స్ లోని చోమ్తాల్ జిల్లాలో జ‌రిగిన వైమానిక దాడిలో ఏడుగురు తాలిబ‌న్ ఉగ్ర‌వాదులు మ‌ర‌ణించారు....

Afghanistan Airstrike: ఆఫ్ఘనిస్థాన్‌లో మళ్లీ వైమానిక దాడి..ఏడుగురు తాలిబాన్ ఉగ్రవాదుల హతం
Subhash Goud
|

Updated on: Dec 26, 2020 | 6:55 AM

Share

ఆప్ఘ‌నిస్థాన్‌లో మ‌ళ్లీ వైమానిక దాడి చోటు చేసుకుంది. ఆప్ఘ‌నిస్థాన్ బాల్ఖు ప్రావిన్స్ లోని చోమ్తాల్ జిల్లాలో జ‌రిగిన వైమానిక దాడిలో ఏడుగురు తాలిబ‌న్ ఉగ్ర‌వాదులు మ‌ర‌ణించారు. ఈ దాడిలో మ‌రో ఐదుగురు ఉగ్ర‌వాదులు గాయ‌ప‌డ్డారని ఆప్ఘ‌నిస్థాన్ ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ ట్వీట్ చేసింది. ఈ వైమానిక దాడిలో ఉగ్ర‌వాదుల ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని ధ్వంసం చేసిన‌ట్లు మంత్రిత్వ‌శాఖ తెలిపింది. ఫ‌రా ప్రావిన్సులోని బోలోక్ జిల్లాలో మ‌రో 8 మంది తాలిబ‌న్ ఉగ్ర‌వాదులు హ‌త‌మార్చామ‌ని తెలిపింది. తాలిబ‌న్ నాయ‌కులు తమ ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తున్న‌ట్లు వ‌రుస వీడియోలు వెలువ‌డిన త‌ర్వాత ఈ వైమానిక దాడి జ‌రిపామ‌ని వివ‌రించింది.

ఇలా ఆప్ఘాన్‌లో వ‌‌రుస‌గా ఉగ్ర‌వాదులు దాడుల‌కు పాల్ప‌డుతుండ‌టంతో వైమానిక ద‌ళాలు రంగంలోకి దిగాయి. ఇప్ప‌టికే ఆప్ఘ‌నిస్థాన్‌లో వ‌ర‌స దాడుల‌తో అట్టుడుకుతోంది. త‌ర‌చూ ఏదో ఒక చోట బాంబు పేలుళ్లు చోటు చేసుకోవ‌డంతో వారి దాడుల‌ను వైమానిక ద‌ళాలు తిప్పికొడుతున్నాయి. అలాగే డిసెంబ‌ర్ 20న కాబూల్‌లో జ‌రిగిన బాంబు పేలుడులో 9 మంది దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. మ‌రో 20 మంది వ‌ర‌కు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఉద‌యం ర‌ద్దీ అధికంగా ఉండే స‌మ‌యంలో న‌డి రోడ్డుపై బాంబు పేల్చారు ఉగ్ర‌వాదులు. ఇలా ఉగ్ర‌వాదుల వ‌రుస దాడుల‌తో రెచ్చిపోవ‌డంతో వైమాన‌క దాడి చేప‌ట్టి తాలిబ‌న్ ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చారు.

బంగారం ధరిస్తే.. ఈ రాశుల వారికి లెక్కలేనన్ని లాభాలు.. ఎదురులేదంతే
బంగారం ధరిస్తే.. ఈ రాశుల వారికి లెక్కలేనన్ని లాభాలు.. ఎదురులేదంతే
పండిన అరటి పండ్లతో దోసెలు.. వీటిని ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట
పండిన అరటి పండ్లతో దోసెలు.. వీటిని ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట
ఖర్జూరం,పాలు 15రోజులు తాగండి చాలు.. ఈ సమస్యలకి దూరంగా ఉండండి..!
ఖర్జూరం,పాలు 15రోజులు తాగండి చాలు.. ఈ సమస్యలకి దూరంగా ఉండండి..!
రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?
రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?
ఆ హీరో సత్తా ఏంటో అప్పుడే తెలిసింది..
ఆ హీరో సత్తా ఏంటో అప్పుడే తెలిసింది..
గ్లాసు మజ్జిగలో ఈ ఒక్కటి కలిపి తాగితే దీర్ఘకాలిక రోగాలు దూరం
గ్లాసు మజ్జిగలో ఈ ఒక్కటి కలిపి తాగితే దీర్ఘకాలిక రోగాలు దూరం
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..
గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ఇమ్యునోథెరపీ
గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ఇమ్యునోథెరపీ
గాజు బాటిల్‎లో తిరుమల ఆలయ గోపురం.. దగ్గరికెళ్లి చూస్తే మరో వండర్
గాజు బాటిల్‎లో తిరుమల ఆలయ గోపురం.. దగ్గరికెళ్లి చూస్తే మరో వండర్
ఇండిగోలో బంగారం మాయం.. పరిహారం మరీ ఇంత తక్కువా
ఇండిగోలో బంగారం మాయం.. పరిహారం మరీ ఇంత తక్కువా