Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొడుకు హత్యకు న్యాయం చేయాలని కోరిన తల్లికి 100 కొరడా దెబ్బలు.. కోర్టు ఇచ్చిన దారుణమైన తీర్పు

ఆధునిక కాలంలో కూడా అక్కడి మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు నెటిజన్లను కలవరపెడుతున్నాయి. తాజాగా జరిగిన ఈ ఉదంతం ప్రతి ఒక్కరినీ కన్నీళ్లుపెట్టిస్తోంది.

కొడుకు హత్యకు న్యాయం చేయాలని కోరిన తల్లికి 100 కొరడా దెబ్బలు.. కోర్టు ఇచ్చిన దారుణమైన తీర్పు
Sharia Court
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 02, 2022 | 9:45 AM

Cruel verdict : మధ్యప్రాచ్య దేశాల్లో మహిళల దయనీయ స్థితిని చాటిచెప్పే మరో ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కాల్పుల్లో మరణించిన తన కుమారుడి మృతికి న్యాయం చేయాలని కోరిన ఓ తల్లికి ఇరాన్‌లోని కోర్టు దారుణమైన శిక్ష విధించింది. న్యాయం చేయాలని కోరిన తల్లికి 100 కొరడా దెబ్బలు కొట్టాలని కోర్టు ఆదేశించింది. జెరూసలేం పోస్ట్ ప్రకారం, తన కొడుకును చంపిన అధికారులను శిక్షించడానికి తల్లి మెహబూబా రంజానీ ‘మదర్స్ ఆఫ్ జస్టిస్’ అనే నినాదంతో ప్రచారం కొనసాగిస్తోంది. దాంతో మొత్తం పరిపాలన విభాగం ఆమెపై తీవ్ర ఆగ్రహంతో ఉంది.

2019లో హత్యకు గురైన కొడుకు ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా తన గళం వినిపించాడు. మెహబూబా రంజానీ తన కొడుకు జమాన్ కోహ్లిపూర్ మరణాన్ని హత్యగా పేర్కొంటూ అధికారులను శిక్షించాలని ప్రచారం చేస్తున్నారు. రంజానీ కుమారుడు జమాన్ 2019లో పీపుల్స్ మూవ్‌మెంట్‌లో చేరాడు. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఇరానియన్లు వీధుల్లోకి రావడంతో, పరిపాలన తీవ్ర గందరగోళంలో పడింది. ప్రజా ఉద్యమం సమయంలో, నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో జమాన్‌తో సహా దాదాపు 1500 మంది చనిపోయారు.

అధికారులకు వ్యతిరేకంగా గొంతు వినిపించడం, న్యాయం కోసం కోర్టుకు వెళ్లడం ద్వారా రంజాని గొంతును అణిచివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జెరూసలెం పోస్ట్ నివేదించింది. హిజాబ్‌కు వ్యతిరేకంగా గొంతు పెంచినందుకు ఆమె గత వారం రంజనీ సహా అనేక మంది మహిళలను అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే ఆ తర్వాత వారిని విడుదల చేశారు. తిరిగి కోర్టుకు వెళ్లి తన కుమారుడికి న్యాయం చేయాలని కోరినప్పుడు ఆమెపట్ల క్రూరమైన శిక్ష విధించబడింది.

ఇవి కూడా చదవండి

తన కుమారుడికి న్యాయం చేయాలని రంజాని మళ్లీ కోర్టును ఆశ్రయించారు. యునైటెడ్ స్టేట్స్‌లో ఇరాన్ మూలానికి చెందిన ఇద్దరు జర్నలిస్టులు ఆమెకు మద్దతుగా నిలిచారు. వారంతా ఇరాన్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు… ఫలితంగా, ఇరాన్‌లోని షరియా కోర్టు ఆమెకు100 కొరడా దెబ్బలు విధించింది. ఈ శిక్షపై పలువురు ఇరానియన్లు సోషల్ మీడియాలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యతిరేకత దృష్ట్యా రంజానిపై కొరడా ఝులిపించడానికి ప్రభుత్వం ఇంకా తేదీని నిర్ణయించలేదని సమాచారం.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి