నిత్యానంద ఎవరు ?? కైలాస దేశానికి వెళ్లాలంటే ఏం చేయాలి ??
నిత్యానంద.. చాలా మందికి పరిచయం అక్కర్లేని పేరు. గతంలో రాసలీలల వీడియోలతో సెన్సేషన్ సృష్టించిన ఈ వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు మృతి చెందారంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రాణ త్యాగం చేశారంటూ ఆయన మేనల్లుడు సుందరేశ్వరన్ తమిళ మీడియాతో చెప్పారు.
దీంతో సోషల్ మీడియా అంతటా నిత్యానంద గురించే చర్చ నడుస్తోంది. తాజాగా ఈ వదంతులపై స్పందించిన కైలాస దేశం.. అదంతా ఉత్తదేనని ప్రకటించింది. నిజానికి నిత్యానంద చనిపోయాడని వార్తలు రావడం ఇదే మొదటిసారికాదు. 2022లోనూ ఇలాంటి వదంతులు వచ్చాయి. ఈ రూమర్స్పై స్పందించిన నిత్యానంద జీవసమాధిలో ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఎవరీ నిత్యానంద..? ఇండియా వదలి ఎందుకు పారిపోయాడు..? అసలు ఆ కైలాస దేశం సంగతేంటి..? వివాదాల స్వామీజీ.. కైలాస దేశ ప్రధాని.. నిత్యానంద.. అలియాస్ నిత్యానంద పరమహంస. స్వయం ప్రకటిత గురువైన ఆయన అసలు పేరు అరుణాచలం రాజశేఖరన్. నిత్యానంద ధ్యానపీఠ స్థాపన మొదలు కైలాస దేశ ఏర్పాటు వరకు ఆయన జీవితంలో జరిగినవన్నీ సంచలనాలే.. అంతకు మించిన వివాదాలే. 1978 జనవరి 1న తమిళనాడులోని తిరువన్నామలైలో జన్మించారు నిత్యానంద.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాత్రూంలో మనిషి జలకాలాట.. ఇంతలో లోపలికి వచ్చిన అనుకోని అతిధి
TOP 9 ET News: దేవరని వెనక్కి నెట్టి.. చరిత్ర సృష్టించిన పెద్ది
Court OTT: OTTలోకి కోర్టు మూవీ.. అఫీషియల్ డేట్ వచ్చేసింది..
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా
ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా
రైల్వే స్టేషన్లో గుండె పగిలే ఘటన..
ఓర్నీ.. మటన్ బొక్క ఎంతపని చేసిందీ

