నలుగురు బందీల కోసం.. 274 మంది గాజా వాసుల ప్రాణాలు తీశారు
సెంట్రల్ గాజాలో నలుగురు బందీల విడుదల కోసం ఇజ్రాయెల్ తాజాగా చేపట్టిన ఆపరేషన్లో ఏకంగా 274 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. దాదాపు 700 మంది గాయాల పాలయ్యారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు. ఈ విషయాన్ని గాజా పాలస్తీనా ఆరోగ్య విభాగం తెలిపింది. తొలుత ఈ ఆపరేషన్లో 100 మంది చనిపోయారని ఇజ్రాయెల్ తెలిపింది. అయితే ఈ సంఖ్య 274కు చేరింది. బాధితుల హాహాకారాలతో అల్-అఖ్సా ఆసుపత్రి నిండిపోయినట్లు ఓ స్వచ్ఛంద సంస్థ తెలిపింది.
సెంట్రల్ గాజాలో నలుగురు బందీల విడుదల కోసం ఇజ్రాయెల్ తాజాగా చేపట్టిన ఆపరేషన్లో ఏకంగా 274 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. దాదాపు 700 మంది గాయాల పాలయ్యారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు. ఈ విషయాన్ని గాజా పాలస్తీనా ఆరోగ్య విభాగం తెలిపింది. తొలుత ఈ ఆపరేషన్లో 100 మంది చనిపోయారని ఇజ్రాయెల్ తెలిపింది. అయితే ఈ సంఖ్య 274కు చేరింది. బాధితుల హాహాకారాలతో అల్-అఖ్సా ఆసుపత్రి నిండిపోయినట్లు ఓ స్వచ్ఛంద సంస్థ తెలిపింది. ఆదివారం సెంట్రల్ గాజాలోని నుసీరాత్ శరణార్థి శిబిరంలోని రెండు వేర్వేరు ప్రదేశాలపై దాడి చేసి హమాస్ చెరలోని నలుగురు బందీలను ఇజ్రాయల్ ప్రత్యేక దళాలు రక్షించాయి. అయితే ఈ క్రమంలో భారీగా ప్రాణనష్టం సంభవించడంపై అంతర్జాతీయంగా ఇజ్రాయెల్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బందీలను రక్షించే సమయంలో బలగాలపై భారీఎత్తున దాడులు జరిగాయని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్ హగారీ తెలిపారు. ఆపరేషన్లో ఓ అధికారి మృతి చెందినట్లు చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా.. సంచులతో ఎగబడిన జనం
సౌర తుపానులను చిత్రీకరించిన ఆదిత్య L1.. ఫోటోలు విడుదల చేసిన ఇస్రో
అకస్మాత్తుగా లేచి కూర్చున్న శవం.. అవాక్కైన స్థానికులు, పోలీసులు
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

