నలుగురు బందీల కోసం.. 274 మంది గాజా వాసుల ప్రాణాలు తీశారు
సెంట్రల్ గాజాలో నలుగురు బందీల విడుదల కోసం ఇజ్రాయెల్ తాజాగా చేపట్టిన ఆపరేషన్లో ఏకంగా 274 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. దాదాపు 700 మంది గాయాల పాలయ్యారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు. ఈ విషయాన్ని గాజా పాలస్తీనా ఆరోగ్య విభాగం తెలిపింది. తొలుత ఈ ఆపరేషన్లో 100 మంది చనిపోయారని ఇజ్రాయెల్ తెలిపింది. అయితే ఈ సంఖ్య 274కు చేరింది. బాధితుల హాహాకారాలతో అల్-అఖ్సా ఆసుపత్రి నిండిపోయినట్లు ఓ స్వచ్ఛంద సంస్థ తెలిపింది.
సెంట్రల్ గాజాలో నలుగురు బందీల విడుదల కోసం ఇజ్రాయెల్ తాజాగా చేపట్టిన ఆపరేషన్లో ఏకంగా 274 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. దాదాపు 700 మంది గాయాల పాలయ్యారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు. ఈ విషయాన్ని గాజా పాలస్తీనా ఆరోగ్య విభాగం తెలిపింది. తొలుత ఈ ఆపరేషన్లో 100 మంది చనిపోయారని ఇజ్రాయెల్ తెలిపింది. అయితే ఈ సంఖ్య 274కు చేరింది. బాధితుల హాహాకారాలతో అల్-అఖ్సా ఆసుపత్రి నిండిపోయినట్లు ఓ స్వచ్ఛంద సంస్థ తెలిపింది. ఆదివారం సెంట్రల్ గాజాలోని నుసీరాత్ శరణార్థి శిబిరంలోని రెండు వేర్వేరు ప్రదేశాలపై దాడి చేసి హమాస్ చెరలోని నలుగురు బందీలను ఇజ్రాయల్ ప్రత్యేక దళాలు రక్షించాయి. అయితే ఈ క్రమంలో భారీగా ప్రాణనష్టం సంభవించడంపై అంతర్జాతీయంగా ఇజ్రాయెల్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బందీలను రక్షించే సమయంలో బలగాలపై భారీఎత్తున దాడులు జరిగాయని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్ హగారీ తెలిపారు. ఆపరేషన్లో ఓ అధికారి మృతి చెందినట్లు చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా.. సంచులతో ఎగబడిన జనం
సౌర తుపానులను చిత్రీకరించిన ఆదిత్య L1.. ఫోటోలు విడుదల చేసిన ఇస్రో
అకస్మాత్తుగా లేచి కూర్చున్న శవం.. అవాక్కైన స్థానికులు, పోలీసులు
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

