చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా.. సంచులతో ఎగబడిన జనం
సాధారణంగా కొన్నదానికంటే కొట్టుకొచ్చింది రుచి ఎక్కువ అని నానుడి. కొనుక్కుని తిన్న దానికంటే ఫ్రీగా వచ్చిన దాన్ని తినడంలో మనవాళ్లు ముందుంటారని చెప్పాలి. దీనికి సరిగ్గా సరిపోతుంది ఈ సీన్. చేపల లోడ్తో వెళ్తున్న ఓ లారీ ప్రమాదవశాత్తు బోల్తాపడింది. అయ్యో అనాల్సింది పోయి..అసలు పట్టించుకోలేదు అక్కడి జనాలు. అసలు లారీలో ఉన్న మనుషులకు ఏమైనా అయ్యిందా అని కూడా కనికరం చూపించలేదు. సంచులు పట్టుకొని చేపల కోసం మాత్రం ఎగబడ్డారు.
సాధారణంగా కొన్నదానికంటే కొట్టుకొచ్చింది రుచి ఎక్కువ అని నానుడి. కొనుక్కుని తిన్న దానికంటే ఫ్రీగా వచ్చిన దాన్ని తినడంలో మనవాళ్లు ముందుంటారని చెప్పాలి. దీనికి సరిగ్గా సరిపోతుంది ఈ సీన్. చేపల లోడ్తో వెళ్తున్న ఓ లారీ ప్రమాదవశాత్తు బోల్తాపడింది. అయ్యో అనాల్సింది పోయి..అసలు పట్టించుకోలేదు అక్కడి జనాలు. అసలు లారీలో ఉన్న మనుషులకు ఏమైనా అయ్యిందా అని కూడా కనికరం చూపించలేదు. సంచులు పట్టుకొని చేపల కోసం మాత్రం ఎగబడ్డారు. విజయవాడ-హైదరాబాద్ రహదారిపై క్యాట్ ఫిష్ చేపల లోడ్తో వెళ్తున్న లారీఅదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్కు గాయాలయ్యాయి. బాధితులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. లారీ బోల్తాపడ్డంతో చేపలు చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో స్థానికులు చేపల కోసం ఎగబడ్డారు. చేపల లోడుతో వెళ్తున్న లారీ ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కారుకు పెట్రోలు కొట్టిద్దామనుకున్న ఓనర్.. బ్యానెట్ లోపల అదిరిపోయే సీన్..!
సౌర తుపానులను చిత్రీకరించిన ఆదిత్య L1.. ఫోటోలు విడుదల చేసిన ఇస్రో
అకస్మాత్తుగా లేచి కూర్చున్న శవం.. అవాక్కైన స్థానికులు, పోలీసులు
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

