ఐడియా అదిరింది.. కరెంట్ అక్కర్లేని ఏసీ.. చల్ల చల్లని కూల్ కూల్
వేసవి ప్రారంభం నుంచే ఎండలు మండిపోతున్నాయి. ప్రతి ఇంట్లో ఏసీలు ఆన్ అవుతున్నాయి. అటక మీద పెట్టిన కూలర్లు కిందకు దిగుతున్నాయి. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం ప్రజలు రకరకాల పద్ధతులు అవలంభిస్తారు. దీంతో ఇళ్లు, కార్యాలయాలు, పరిశ్రమల్లో విద్యుత్తు వినియోగం కూడా విపరీతంగా పెరిగింది.
మరోవైపు మార్కెట్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలకు గిరాకీ ఏర్పడింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటుందనే దానిపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని ప్రాంతాల్లో వేసవి ఉష్ణోగ్రతలు 48 నుంచి 50 డిగ్రీల దాకా వెళ్తుంటాయి. అలాంటి ప్రాంతాల్లోని ప్రజలకు కరెంటు బిల్లును ఆదా చేసుకునేలా, నిండువేసవిలోనూ ఇంటిని చల్లగా ఉంచుకునేందుకు ఓ యువకుడు చేసిన ఉపాయం అందరినీ ఆకట్టుకుంటోంది. తక్కువ ఖర్చుతో ఇంట్లో ఏసీ లాంటి చల్లదనాన్ని నింపాడు. హర్యానాలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ సాధారణంగానే 45 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. పట్టణాలు, గ్రామాలు రాత్రిపూట కూడా చల్లబడవు. ఈ క్రమంలోనే హిసార్కు చెందిన ఒక ఆర్కిటెక్ట్ ఈ సమస్యకు చెక్పెట్టే మార్గం కనుగొన్నారు. 7వేల మట్టి ముంతలతో ఇంటిని చల్లబరిచే ప్రయత్నం చేశారు. హిసార్లోని సెక్టార్ 14లో నివాసముండే గోకుల్ అనే యువకుడు ఢిల్లీలో ఆర్కిటెక్చర్ డిగ్రీ చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొంపముంచిన ఛాయ్.. టీ తాగడానికి ట్రైన్ దిగి 20 ఏళ్లుగా వెట్టి చాకిరీ
ఇది కదా విశ్వాసం అంటే.. యజమాని కోసం పులితో పోరాడి ఓడిన శునకం
ఆన్లైన్లోకి ఆర్టీఏ సేవలు.. ఇకపై ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

