వందే మెట్రో కాదు.. ఇకపై నమో భారత్‌ ర్యాపిడ్ రైల్‌

మెట్రో నగరాల మధ్య రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఉద్దేశించిన వందే మెట్రో రైలు పేరు మారింది. ఇక నుంచి దానిని నమో భారత్‌ ర్యాపిడ్ రైల్‌ గా పిలవనున్నారు. దేశంలోనే తొలి వందే మెట్రో సర్వీసు సెప్టెంబర్‌ 16 ప్రధాని మోదీ చేతుల మీదుగా గుజరాత్‌లో ప్రారంభించారు. ఈ క్రమంలో ఈ రైలు పేరు మార్పుపై ప్రకటన వచ్చింది. దేశంలో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. అమృత్‌ భారత్‌ రైలూ అందుబాటులోకి వచ్చింది.

వందే మెట్రో కాదు.. ఇకపై  నమో భారత్‌ ర్యాపిడ్ రైల్‌

|

Updated on: Sep 20, 2024 | 4:47 PM

మెట్రో నగరాల మధ్య రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఉద్దేశించిన వందే మెట్రో రైలు పేరు మారింది. ఇక నుంచి దానిని నమో భారత్‌ ర్యాపిడ్ రైల్‌ గా పిలవనున్నారు. దేశంలోనే తొలి వందే మెట్రో సర్వీసు సెప్టెంబర్‌ 16 ప్రధాని మోదీ చేతుల మీదుగా గుజరాత్‌లో ప్రారంభించారు. ఈ క్రమంలో ఈ రైలు పేరు మార్పుపై ప్రకటన వచ్చింది. దేశంలో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. అమృత్‌ భారత్‌ రైలూ అందుబాటులోకి వచ్చింది. సెప్టెంబరు 16 నుంచి ఈ వందే మెట్రో పట్టాలెక్కుతోంది. వందే మెట్రో అనేది పూర్తి అన్‌రిజర్వ్‌డ్‌ ఎయిర్‌ కండీషన్‌తో కూడిన రైలు. ఇందులో 1150 మంది కూర్చుని, 2058 మంది నిల్చుని ప్రయాణం చేయొచ్చని పశ్చిమ రైల్వే వెల్లడించింది. అహ్మదాబాద్- భుజ్‌ల మధ్య 9 స్టాపుల్లో ఈ రైలు ఆగుతుందని తెలిపింది. 360 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల 45 నిమిషాల్లోనే చేరుకుంటుందని చెప్పింది. గరిష్ఠంగా 110 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని పేర్కొంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

13 ఏళ్ల చిన్నారి.. 800 కేజీల మిల్లెట్లతో ఏం చేసిందో తెలుసా ??

ఆ గుళ్లో మొక్కు తీరాక పాడె ఎక్కాల్సిందే

స్పేస్‌ వాక్‌ చేసిన బిలియనీర్‌.. ఒకప్పుడు స్కూల్‌ డ్రాపౌట్‌

ఇంట్లోకి దూసుకొస్తున్న పాము.. చెప్పు విసిరిన యజమాని.. ఆ తర్వాత ??

ఇది పండు కాదు.. ఎన్నో వ్యాధులను తరిమికొట్టే రామబాణం

Follow us