ఆ గుళ్లో మొక్కు తీరాక పాడె ఎక్కాల్సిందే
చాలామంది కష్టమొచ్చినప్పుడు చేతులు జోడించి దేవుడికి దండం పెట్టుకుంటారు. ఆ గండం గడిచి గట్టెక్కితే చాలు ఫలానాది చేస్తానని మొక్కుకోవడం చూస్తుంటాం. దానికి తగ్గట్టుగా అనంతరం ఇష్టదైవం దర్శనానికి వెళ్లడం, తలనీలాలు సమర్పించడం, హుండీలో కానుకలు వేయడం, తులాభారం వంటివెన్నో చేస్తుంటారు. తమిళనాడులోని తంజావూర్ దగ్గరున్న వళంగైమాన్లో మొక్కు తీర్చుకునే తీరు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే- చనిపోయినవారిని శ్మశానవాటికకు తీసుకెళ్లేప్పుడు పాడె కడతారు కదా.
చాలామంది కష్టమొచ్చినప్పుడు చేతులు జోడించి దేవుడికి దండం పెట్టుకుంటారు. ఆ గండం గడిచి గట్టెక్కితే చాలు ఫలానాది చేస్తానని మొక్కుకోవడం చూస్తుంటాం. దానికి తగ్గట్టుగా అనంతరం ఇష్టదైవం దర్శనానికి వెళ్లడం, తలనీలాలు సమర్పించడం, హుండీలో కానుకలు వేయడం, తులాభారం వంటివెన్నో చేస్తుంటారు. తమిళనాడులోని తంజావూర్ దగ్గరున్న వళంగైమాన్లో మొక్కు తీర్చుకునే తీరు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే- చనిపోయినవారిని శ్మశానవాటికకు తీసుకెళ్లేప్పుడు పాడె కడతారు కదా. దానిమీద ఊరేగిస్తూ అంతిమ సంస్కారాలకు తీసుకెళతారు. అందుకే ఆ పేరును కూడా చాలామంది తలచుకోరు. కానీ వళంగైమాన్లోని మారియమ్మన్ ఆలయానికి వెళ్లిన వాళ్లు- కోరిన కోరికలు తీరాక పాడె ఎక్కాల్సిందే. మొక్కు చెల్లించాల్సిన వారెవరైనా చనిపోయినవారి మాదిరి పాడె కట్టించుకుని ఊరంతా ఊరేగిన తరవాత ఆలయానికి చేరుకుంటారు. అక్కడికి వెళ్లాక పూజారి తులసి తీర్థం చల్లాక మొక్కు తీరిపోతుంది. ఇలా చేయడం వల్ల మారియమ్మన్ ఆయురారోగ్యాలనీ అష్టైశ్వర్యాలనీ ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్పేస్ వాక్ చేసిన బిలియనీర్.. ఒకప్పుడు స్కూల్ డ్రాపౌట్
ఇంట్లోకి దూసుకొస్తున్న పాము.. చెప్పు విసిరిన యజమాని.. ఆ తర్వాత ??
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

