Allu Arjun: ఎక్కడా తగ్గేదే లే.! పాన్ ఇండియా క్రేజ్ అందుకున్న అల్లు అర్జున్.

వరల్డ్ వైడ్ క్రేజ్ అందుకున్న అల్లు అర్జున్.. ఇప్పుడు మరో అరుదైన గౌరవం సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్న మొట్ట మొదటి టాలీవుడ్ హీరోగా రికార్డ్ సృష్టించగా.. ఇప్పుడు మేడమ్ టూస్సాడ్స్ మ్యూజియంలో బన్నీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గతేడాది అక్టోబర్ నెలలో మ్యూజియం నిర్వాహకులు అల్లు అర్జున్ దగ్గరకి వచ్చి కొలతలు తీసుకున్న సంగతి తెలిసిందే.

Allu Arjun: ఎక్కడా తగ్గేదే లే.! పాన్ ఇండియా క్రేజ్ అందుకున్న అల్లు అర్జున్.

|

Updated on: Mar 31, 2024 | 1:32 PM

వరల్డ్ వైడ్ క్రేజ్ అందుకున్న అల్లు అర్జున్.. ఇప్పుడు మరో అరుదైన గౌరవం సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్న మొట్ట మొదటి టాలీవుడ్ హీరోగా రికార్డ్ సృష్టించగా.. ఇప్పుడు మేడమ్ టూస్సాడ్స్ మ్యూజియంలో బన్నీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గతేడాది అక్టోబర్ నెలలో మ్యూజియం నిర్వాహకులు అల్లు అర్జున్ దగ్గరకి వచ్చి కొలతలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బన్నీ విగ్రహాం పూర్తి కాగా.. మార్చి 28న రాత్రి అల్లు అర్జున్ స్వయంగా తన మైనపు విగ్రహాన్ని ఓపెనింగ్ చేశారు. ఈ విగ్రహం అల వైకుంఠపురంలో.. సినిమాలోని రెడ్ జాకెట్ కాస్ట్యూమ్ తో పుష్ప మేనరిజం చూపిస్తూ తగ్గేదేలే అన్నట్లుగా ఉంది. ఇక ఓపెనింగ్ తర్వాత తన మైనపు విగ్రహంతో సెల్ఫీ తీసుకుని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు బన్నీ. పోస్ట్ చేయడమే కాదు ఈ ఫోటోలకు తగ్గేదే లే అంటూ కామెంట్ చేశాడు. అలాగే మైనపు విగ్రహం ఓపెనింగ్ వీడియోను కూడా పంచుకున్నాడు. బన్నీతో పాటు ఆయన ఫ్యామిలీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది. ప్రస్తుతం అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఫోటోస్ వైరలవుతుండగా.. బన్నీకి కంగ్రాట్స్ తెలుపుతున్నారు సినీ సెలబ్రెటీస్, అభిమానులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us
Latest Articles