AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వినాయక నిమజ్జనంలో అపశ్రుతి.. భక్తుల మీద పడిపోయిన గణనాధుని విగ్రహం..

Hyderabad: హైదరాబాదులో గణేష్ నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే నిమజ్జనం ముగిసిన తరువాత రోజు ఆలస్యంగా ఓ ఘటన బయట పడింది. హైదరాబాద్ బన్సిలాల్ పేట్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ నిమజ్జనం సందర్భంగా విగ్రహాల ఊరేగింపు కొనసాగుతున్న తరుణంలో ఒక్కసారిగా వినాయకుడి విగ్రహం భక్తుల మీదకు పడిపోయింది. విగ్రహాన్ని పట్టుకునే ప్రయత్నం చేసిన ఫలితం లేదు. విగ్రహం కింద పడి నలుగురికి గాయాలు అయ్యాయి. స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ఈ దృశ్యాలన్నీ రికార్డు అయ్యాయి.

Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Sep 30, 2023 | 3:25 PM

Share

హైదరాబాద్, సెప్టెంబర్ 30: హైదరాబాదులో గణేష్ నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. రెండు రోజుల పాటు సాగిన కోలహలం మధ్య గణేష్ నిమజ్జనం అద్యంతం అంగరంగ వైభవంగా సాగింది. గణేష్ నిమజ్జనం ముగిసిన తరువాత రోజు ఆలస్యంగా ఓ ఘటన బయట పడింది. హైదరాబాద్ బన్సిలాల్ పేట్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ నిమజ్జనం సందర్భంగా విగ్రహాల ఊరేగింపు కొనసాగుతున్న తరుణంలో ఒక్కసారిగా వినాయకుడి విగ్రహం భక్తుల మీదకు పడిపోయింది. విగ్రహాన్ని పట్టుకునే ప్రయత్నం చేసిన ఫలితం లేదు. విగ్రహం కింద పడి నలుగురికి గాయాలు అయ్యాయి. నిమజ్జనం రోజు రాత్రి పది గంటల 30 నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ఈ దృశ్యాలన్నీ రికార్డు అయ్యాయి.

అసలేం జరిగిందంటే.. ట్యాంక్ బండ్లో నిమజ్జనం సందర్భంగా రాణిగంజ్ నుండి ట్యాంక్ బండ్‌కు విగ్రహాలు క్యూ కట్టాయి. అప్పటికే టస్కర్ నుండి గణేష్ విగ్రహాన్ని కిందికి దించారు. క్రేన్ సహాయంతో నిమజ్జనం చేయాల్సి ఉన్న తరుణంలో కాసేపు విగ్రహాన్ని అలా పక్కకు పెట్టారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఓ మహిళా భక్తురాలు గణేశుడికి దండం పెట్టుకోవడానికి విగ్రహం ముందుకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా విగ్రహం కింద పడిపోయింది. విగ్రహం పడిన సమయంలో దాదాపు పది మంది విగ్రహం కింద ఉండిపోయారు. అయితే ఒక్కసారిగా స్థానికులందరూ అలర్ట్ కావడంతో విగ్రహాన్ని సాధారణ స్థితికి తీసుకు రాగలరు. విగ్రహాన్ని పైకి లేపగానే కింద ఉన్న వారిని అందరిని సురక్షితంగా రక్షించారు స్థానికులు.

అయితే ఈ సారి హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో పలు చోట్ల ఇలాంటి అపశృతుల కారణంగా మొత్తం ఐదు మంది మరణించారు. టస్కర్ల కింద పడి ముగ్గురు మరణించగా.. నిమజ్జనం సందర్భంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరో ఇద్దరు మరణించారు. ఈ ఘటనలు మినహా మిగతా నిమజ్జనం అంతా ప్రశాంతంగా సాగింది. 40 వేల మంది పోలీసులతో అడుగడుగునా సిసి కెమెరాల నిఘాలో భాగ్యనగరంలో గణేష్ నిమర్జనం ప్రశాంతంగా ముగిసింది.

Follow Us
టెక్కీల అద్భుతం..సింగపూర్‌తో రూ.80 కోట్ల ఒప్పందం, ఆనంద్
టెక్కీల అద్భుతం..సింగపూర్‌తో రూ.80 కోట్ల ఒప్పందం, ఆనంద్
ఐపీఎల్ తరహాలో NZ20ని ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్
ఐపీఎల్ తరహాలో NZ20ని ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్
మీ ఇంట్లో 100గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉంటే ఏమవుతుందో తెలుసా..?
మీ ఇంట్లో 100గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉంటే ఏమవుతుందో తెలుసా..?
రైతు భరోసాకు ప్రభుత్వం కొత్త రూల్స్.. రైతులందరికీ..
రైతు భరోసాకు ప్రభుత్వం కొత్త రూల్స్.. రైతులందరికీ..
అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు:కిషన్ రెడ్డి
అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు:కిషన్ రెడ్డి
నార్మల్ పెట్రోల్ Vs పవర్ పెట్రోల్.. ఈ రెండిటిలో మీ వాహనానికి
నార్మల్ పెట్రోల్ Vs పవర్ పెట్రోల్.. ఈ రెండిటిలో మీ వాహనానికి
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఈ ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్లు
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఈ ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్లు
లిఫ్టులో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనుక అసలు సీక్రెట్‌
లిఫ్టులో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనుక అసలు సీక్రెట్‌
రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్‌గా రియాన్ పరాగ్
రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్‌గా రియాన్ పరాగ్
వేసవి వేడితోనూ హార్ట్ స్ట్రోక్.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
వేసవి వేడితోనూ హార్ట్ స్ట్రోక్.. ఈ జాగ్రత్తలు తీసుకోండి