భారత్ మరో విజయం.. ఇస్రో మరో ప్రయోగం సక్సెస్‌

చంద్రయాన్‌-3 ప్రాజెక్టులో భాగంగా భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగాన్ని విజయవంతంగా మొదలుపెట్టింది. చంద్రుడి కక్ష్యలోకి పరికరాలను పంపిన ఇస్రో.. ఇప్పుడు వాటిని వెనక్కి తీసుకురావడంపై దృష్టిపెట్టింది. ఇటీవల చంద్రయాన్‌-3లో భాగంగా ప్రయోగించిన ప్రొపల్షన్‌ మాడ్యుల్‌ను తాజాగా జాబిల్లి కక్ష్య నుంచి తిరిగి భూకక్ష్య వైపు మళ్లించినట్లు ఇస్రో ప్రకటించింది. అరుదైన ఈ ప్రయోగంలో విజయవంతమయ్యామని తెలిపింది.

భారత్ మరో విజయం.. ఇస్రో మరో ప్రయోగం సక్సెస్‌

|

Updated on: Dec 05, 2023 | 9:48 PM

చంద్రయాన్‌-3 ప్రాజెక్టులో భాగంగా భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగాన్ని విజయవంతంగా మొదలుపెట్టింది. చంద్రుడి కక్ష్యలోకి పరికరాలను పంపిన ఇస్రో.. ఇప్పుడు వాటిని వెనక్కి తీసుకురావడంపై దృష్టిపెట్టింది. ఇటీవల చంద్రయాన్‌-3లో భాగంగా ప్రయోగించిన ప్రొపల్షన్‌ మాడ్యుల్‌ను తాజాగా జాబిల్లి కక్ష్య నుంచి తిరిగి భూకక్ష్య వైపు మళ్లించినట్లు ఇస్రో ప్రకటించింది. అరుదైన ఈ ప్రయోగంలో విజయవంతమయ్యామని తెలిపింది. ఒక కక్ష్య పెంపు విన్యాసం, ఒక ట్రాన్స్-ఎర్త్ ఉత్తేజిత ప్రక్రియ ద్వారా ప్రొపల్షన్ మాడ్యూల్‌ను భూకక్ష్యలోకి ప్రవేశపెట్టినట్టు వివరించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఇస్రో ప్రకటన చేసింది. ప్రొపల్షన్ మాడ్యూల్‌పై ఉన్న SHAPE పేలోడ్‌ భూమిపై పరిశోధనలు నిర్వహించనుంది. ఇది 36,000 కిలోమీటర్ల ఎత్తులో భూమి జియో బెల్ట్‌లోకి ప్రవేశించే సమయంలో, దిగువ కక్ష్యలోకి వచ్చే సమయంలో ఉపగ్రహాలను ఢీకొనకుండా అక్టోబర్‌లోనే పక్కగా ప్లాన్‌ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయోధ్యలో ప్రతిష్టించడానికి సిద్ధమవుతున్న ధ్వజస్తంభాలు ఇవే

థాయ్ లాండ్ లో ప్రమాదం.. 14 మంది మృతి

హైదరాబాద్‌పై మిచౌంగ్ ఎఫెక్ట్‌.. రెండు రోజులు అతి భారీ వర్షాలు

Cyclone Michaung: తిరుమలలో తుపాన్ ఎఫెక్ట్.. భారీ వర్షం, ఈదురు గాలులు

TOP 9 ET News: క్లీన్‌గా హాయ్‌ నాన్నా..| గెట్ రెడీ ఫర్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్

 

Follow us