మహానటి.. 15 ఏళ్లుగా పెన్షన్ కోసం అంధురాలిగా నటించిన మహిళ.. చివరికి

వయసైపోయిన వాళ్లకు, వికలాంగులకు ప్రభుత్వాలు ఫించన్లు ఇచ్చి ఆదుకోవడం సహజమే. కానీ ఓ మహిళ మాత్రం ఫించన్ కోసం ఏకంగా 15 ఏళ్ల పాటు అంధురాలిగా నటించి అధికారులను బొల్తా కొట్టించింది.

మహానటి.. 15 ఏళ్లుగా పెన్షన్ కోసం అంధురాలిగా నటించిన మహిళ.. చివరికి
Woman
Follow us

|

Updated on: Apr 01, 2023 | 6:49 PM

వయసైపోయిన వాళ్లకు, వికలాంగులకు ప్రభుత్వాలు ఫించన్లు ఇచ్చి ఆదుకోవడం సహజమే. కానీ ఓ మహిళ మాత్రం ఫించన్ కోసం ఏకంగా 15 ఏళ్ల పాటు అంధురాలిగా నటించి అధికారులను బొల్తా కొట్టించింది. వివరాల్లోకి వెళ్తే ఇటలీకి చెందిన 48 ఏళ్ల మహిళ ప్రభుత్వం నుంచి వచ్చే ఫించన్ ను దక్కించుకోవాలని ఆశపడింది. 15 క్రితమే తాను అంధురాలినంటూ వైద్యుడి నుంచి ధ్రువీకరణ పత్రం పొందింది. ఆ తర్వాత సామాజిక భద్రత ఫించన్ కు దరఖాస్తు చేసుకంది. ఆమె నిజంగానే అంధురాలని అధికారులు కూడా నమ్మి ఫించను మంజూరు చేశారు. గత 15 ఏళ్ల నుంచి ఆమె ఫించన్ రూపంలో దాదాపు రూ.1.8 కోట్లు తీసుకుంది.

ఓ రోజు ఆమె ఎలాంటి ఇబ్బందులు పడకుండానే సెల్ పోన్ ను స్క్రోల్ చేయడం.. ఫైళ్లపై సంతకాలు చేయడాన్ని అధికారులు గుర్తించారు. చివరికి ఆమె బండారం బయటపడింది. చట్టపరంగా ఆమెపై చర్యలు చేపట్టారు. అలాగే ఆమెకు ఆసుపత్రిలో అంధురాలిగా ధ్రువీకరణ పత్రం ఇచ్చిన వైద్యడ్ని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఏది ఏమైనా దాదాపు 15 ఏళ్లుగా ప్రభుత్వం కళ్లుగప్పి ఫించను తీసుకుంటూ మోసం చేసిన చేసిన ఇలాంటి వారిని ఇంతవరకు చూడలేమంటూ నెటీజన్లు తమ అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..