AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber Fraud : ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా..? ఇలా కూడా మోసం చేస్తారు..! బీకేర్‌ ఫుల్‌..

సైబర్ మోసగాళ్లు ఏదో ఒక విధంగా అమాయకులను మోసం చేస్తున్నారని వింటూనే ఉంటాం. కానీ, మనం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో జాగ్రత్త అనే వార్తలు వచ్చినా మోసపోయే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అలాంటి ఉదంతం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. మీ ఫోన్ రింగ్ అయినప్పుడు, మీరు దానిపై రికార్డ్ చేయబడిన వాయిస్ విన్నప్పుడు, జాగ్రత్త వహించండి. ఇది స్కామ్ కాల్ కూడా కావచ్చు.

Cyber Fraud : ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా..? ఇలా కూడా మోసం చేస్తారు..! బీకేర్‌ ఫుల్‌..
Cyber Fraud
Jyothi Gadda
|

Updated on: Feb 20, 2024 | 7:40 PM

Share

ప్రస్తుత కాలంలో ఆధునిక సాంకేతికత చాలా ప్రయోజనాలను తెచ్చిపెట్టింది. అయితే హ్యాకర్లు, సైబర్‌ మోసగాళ్ళు మోసం చేయడానికి కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. IVR సిస్టమ్ ద్వారా ప్రజలు కాల్ చేసినప్పుడు రికార్డ్ చేయబడిన వాయిస్‌ను వినండి. దీని ద్వారా హ్యాకర్లు లక్షల డబ్బు కొల్లగొడుతున్నారు. అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. అవును, సైబర్ మోసగాళ్లు ఏదో ఒక విధంగా అమాయకులను మోసం చేస్తున్నారని వింటూనే ఉంటాం. కానీ, మనం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో జాగ్రత్త అనే వార్తలు వచ్చినా మోసపోయే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అలాంటి ఉదంతం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. మీ ఫోన్ రింగ్ అయినప్పుడు, మీరు దానిపై రికార్డ్ చేయబడిన వాయిస్ విన్నప్పుడు, జాగ్రత్త వహించండి. ఇది స్కామ్ కాల్ కూడా కావచ్చు.

ఢిల్లీలో ఇలాంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ నుండి ఆటోమేటెడ్ కాల్ వచ్చిన తర్వాత 26 ఏళ్ల మహిళా వ్యాపారవేత్త బ్యాంకు ఖాతాలోంచి రూ.97,000 లు పోగొట్టుకున్నారు. ఆ మహిళ వెంటనే స్థానిక సైబర్ సెల్‌ను సంప్రదించింది. విచారణలో మాజీ డెలివరీ బాయ్ గ్యాంగ్ మోసం వెల్లడైంది. ఇందులో అతని సహచరులలో ఒకరు ప్రమేయం ఉన్నారని, ఇప్పుడు ఢిల్లీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

IVR వ్యవస్థ ద్వారా మోసం.. ఫుడ్ డెలివరీ యాప్‌తో లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేయడానికి ముఠా IVR (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) సిస్టమ్‌ను ఉపయోగించింది. ఇది స్వయంచాలక టెలిఫోన్ వ్యవస్థ. ఇది ముందుగా రికార్డ్ చేయబడిన సందేశాలతో సహా అనేక ఇంటర్‌ఫేస్‌లను కలిగి ఉంటుంది. దీంతో ప్రజలు మోసపోతున్నారు.

ఇవి కూడా చదవండి

చాలా మంది ప్రజలు ఆన్‌లైన్‌లో ఆహారాన్ని తరచుగా ఆర్డర్ చేస్తారు. అలాంటప్పుడు ఇలాంటి కాల్స్‌ను స్వీకరించేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. వీటిలో దేనినైనా నిర్లక్ష్యం చేయడం వలన మీరు భారీ నష్టాలకు గురవుతారు. కాబట్టి ఈ కొత్త తరహా సైబర్ నేరాలు, మోసాల పట్ల జాగ్రత్త వహించండి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..