AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: భారతీయ సంప్రదాయంపై మనసుపడ్డ విదేశీ వనితలు.. చీరలు ధరించి సందడి చేసిన చైనా మగువలు

భారతీయ మహిళలకు వస్త్రధారణకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది చీర. కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా చీరలను విదేశీవనితలు కూడా ధరించడానికి ఇష్టపడుతున్నారు. దీనికి నిదర్శనంగా అనేక సంఘటనలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా భారతీయు మగువులకు వన్నె తెచ్చిన చీరలను తాజాగా చైనీస్ మహిళలు ధరించారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను భారతీయ వ్లాగర్ తన యూట్యూబ్ షార్ట్స్‌లో దీనిని పంచుకున్నాడు. ఈ వీడియో పలువురుని ఆకట్టుకుంది.

Viral Video: భారతీయ సంప్రదాయంపై మనసుపడ్డ విదేశీ వనితలు.. చీరలు ధరించి సందడి చేసిన చైనా మగువలు
Viral Video
Surya Kala
|

Updated on: Jul 09, 2025 | 4:36 PM

Share

ఒకప్పుడు చీరలు భారతీయ అమ్మాయిలకే పరిమితం. అయితే ఇప్పుడు ఈ ఆలోచన మారిపోయింది, భారతీయ సంస్కృతిని ప్రపంచంలోని వివిధ దేశాలు అనుసరిస్తున్నాయి. విదేశీయులు భారతీయ సంప్రదాయాలను, ఆచారాలు, ఆహారపు అలవాట్లను ఇష్టపడుతున్నారు. ఇప్పుడు దీనికి నిదర్శనంగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన భారతీయులు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే మలేషియాలోని బాటు గుహలలో ఇద్దరు చైనీస్ మహిళలు భారతీయ సంప్రదాయానికి పట్టుగొమ్మ అయిన చీరలు ధరించి ఉన్నారు. వారిని ఒక భారతీయ వ్యక్తి చూశాడు . ఈ చైనీస్ మహిళలు చీరలలో బొమ్మల మాదిరిగా కనిపించారు. అతను వారి ఫోటోను క్లిక్ చేసి సంబరాలు చేసుకున్నాడు. ఒక భారతీయ వ్లాగర్ తన యూట్యూబ్‌లో చైనీయులు చీరలు ధరిస్తున్నారని చెప్పాడు. ఈ వ్లాగర్ ఆ మహిళలను ప్రశంసించాడు. వారు చీరలలో చాలా బాగున్నారని చెప్పాడు. దీనికి చైనీస్ మహిళలు చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు.

ఈ వీడియోలో ఇద్దరు మహిళలు ఫోటోకు పోజు ఇస్తున్నట్లు చూడవచ్చు. ఒకరు ఆకుపచ్చ చీర ధరించగా, మరొకరు ఎరుపు-గులాబీ రంగు కలయికతో ఉన్న చీర ధరించి ఉన్నారు. ఈ ఇద్దరు చైనీస్ యువతులు భారతీయ మహిళలా చీరలు కట్టుకున్నారు. అంతేకాదు చీరకు తగిన విధంగా నగలు, గాజులు, పువ్వులు ధరించారు. అక్కడ నడుస్తున్న ప్రజలు వారిని ఆశ్చర్యంగా చూశారు. మరో ప్రత్యేకత ఏమిటంటే గతంలో భారతీయ మహిళలు ఉపయోగించే బ్యాగులను పట్టుకుని వీరు ఫోటోషూట్ చేశారు.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి:

ఇవి కూడా చదవండి

ఈ వీడియోలో వ్లాగర్ ఈ మహిళలు చైనా నుంచి వచ్చారని, చీరలు ధరించి మలేషియాలోని బటు గుహల్లో సందడి చేశారని.. వారితో మాట్లాడి ఫోటో కూడా తీసుకున్నట్లు చెప్పాడు. ఈ వీడియోలో వ్లాగర్, “అందరికీ నమస్కారం.. నాకు భారతదేశం, నా వ్యక్తిగత అనుభవాల వీడియోలను తీయడం.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి పది మంది చూసేలా వాటిని పంచుకోవడం చాలా ఇష్టమని చెప్పారు. వాటిని మీతో పంచుకోవడం నాకు చాలా ఇష్టం. ఈ జీవితం నన్ను ఎక్కడికి తీసుకెళుతుందో చూద్దాం. నేను మీతో అన్ని మంచి, ఉత్తేజకరమైన అనుభవాలను పంచుకుంటున్నాను” అని చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..