AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spit Jihad Case: మరోసారి వెలుగులోకి స్పిట్ జిహాద్.. వీడియో వైరల్‌తో పోలీసులు ఏమన్నారంటే..?

స్పిట్ జిహాద్ విషయమై ఫిర్యాదు వస్తే, కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మొరాదాబాద్ సిటీ ఎస్పీ రణ్‌విజయ్ సింగ్ తెలిపారు.

Spit Jihad Case: మరోసారి వెలుగులోకి స్పిట్ జిహాద్.. వీడియో వైరల్‌తో పోలీసులు ఏమన్నారంటే..?
Viral Footage
Balaraju Goud
|

Updated on: Oct 29, 2024 | 7:46 PM

Share

ఉత్తరప్రదేశ్‌లో స్పిట్ జిహాద్ కేసులు ఆగే సూచనలు కనిపించడం లేదు. ఇప్పుడు మొరాదాబాద్‌లో కొత్త కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక పాల వ్యాపారి మొదట పాల డబ్బాలో ఉమ్మివేసి, ఆపై అదే పాలను వినియోగదారుడి పాత్రలో పోశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియో సీసీటీవీ కెమెరా ఫుటేజీ. ఈ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.

మొరాదాబాద్ సిటీ ఎస్పీ రణ్‌విజయ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ విషయమై ఫిర్యాదు వస్తే పోలీసులు కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వీడియో దృష్టికి రావడంతో పోలీసులు తమ స్థాయిలో విచారణ జరిపారని చెప్పారు. ఇందులో రెండు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పాలవాడు డబ్బాలో ఉమ్మివేస్తున్నాడు అనేది ఒక వాస్తవం. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రెండవ వాస్తవం ఏమిటంటే, పాల వ్యాపారి.. ఎన్ని పాలు మిగిలి ఉన్నాయో అని డబ్బాలోకి చూస్తున్నాడు అనేదీ మరో కోణం. పాలను కొనుగోలు చేస్తున్న వ్యక్తి ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వాస్తవం బయటపడింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వైరల్ వీడియో మొరాదాబాద్ నగరంలోని కత్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవ్‌పూర్ గ్రామానికి చెందినది. పాలు అమ్ముతున్న వ్యక్తి పేరు ఆలం అని, పాల డబ్బాలో ఉమ్మివేసి పాలు విక్రయిస్తున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇక్కడ నివసించే గుప్తాజీకి పాలు ఇవ్వడానికి ఈ వ్యక్తి ప్రతిరోజూ వస్తాడని వెల్లడైంది. పాలు ఇచ్చి వాళ్ళ ఇంటి నుండి బయటకు రాగానే తన పాత్రలో ఏదో పని చేస్తాడని అనుమానం వ్యక్తం చేశారు కొనుగోలుదారులు.

ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. పాల వ్యాపారి డబ్బాలో ఉమ్మేస్తున్నారని వాపోతున్నారు. అయితే, పాలను కొలిచిన తర్వాత, ఎంత మిగిలి ఉందో చూసేందుకు పాల వ్యాపారి డబ్బాను పరిశీలిస్తున్నట్లు పాలను కొనుగోలు చేసిన గుప్తాజీ తన ప్రకటనలో తెలిపారు. సిటీ ఎస్పీ ప్రకారం, ప్రస్తుతం కత్ఘర్ పోలీస్ స్టేషన్ ఈ విషయంపై దర్యాప్తు చేస్తోంది. దీనికి సంబంధించి ఫిర్యాదు వస్తే, దానిని కూడా విచారణలో పొందుపరుస్తామని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
హాస్యనటి కనకం చివరి రోజులు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
హాస్యనటి కనకం చివరి రోజులు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
ప్యాకేజీ కాదు.. ప్రశాంతత ముఖ్యం..
ప్యాకేజీ కాదు.. ప్రశాంతత ముఖ్యం..
పల్లెటూరి స్టైల్ రెసిపీ.. పచ్చి మిర్చి తొక్కు, కోడిగుడ్డు
పల్లెటూరి స్టైల్ రెసిపీ.. పచ్చి మిర్చి తొక్కు, కోడిగుడ్డు
పుచ్చకాయను సులభంగా కోసే జపనీస్ టెక్నిక్.. ఇలా ప్రయత్నించండి
పుచ్చకాయను సులభంగా కోసే జపనీస్ టెక్నిక్.. ఇలా ప్రయత్నించండి
అమ్మో నిమ్మ..! ఇటు కొనలేం.. అటు తాగలేం.. ఎండల్లో షాకిస్తున్న ధరలు
అమ్మో నిమ్మ..! ఇటు కొనలేం.. అటు తాగలేం.. ఎండల్లో షాకిస్తున్న ధరలు
వాట్సప్‌ వాడేవారికి షాకింగ్.. త్వరలో సబ్‌స్క్రిప్షన్ మోడల్..
వాట్సప్‌ వాడేవారికి షాకింగ్.. త్వరలో సబ్‌స్క్రిప్షన్ మోడల్..
బ్లాక్ బస్టర్ 'బద్రి'కి 26 ఏళ్లు.. రిజెక్ట్ చేసిన హీరో ఎవరంటే?
బ్లాక్ బస్టర్ 'బద్రి'కి 26 ఏళ్లు.. రిజెక్ట్ చేసిన హీరో ఎవరంటే?
ఈ నేచురల్ ఫేస్ ప్యాక్‌తో మిలమిల మెరిసే చర్మం మీసొంతం
ఈ నేచురల్ ఫేస్ ప్యాక్‌తో మిలమిల మెరిసే చర్మం మీసొంతం
మా పిల్లి గర్భం దాల్చడానికి మీ పిల్లే కారణం.. పోలీసుల జోక్యం తో
మా పిల్లి గర్భం దాల్చడానికి మీ పిల్లే కారణం.. పోలీసుల జోక్యం తో
మీ ఎయిర్ కూలర్‌ను ఏసీలా మార్చేయండి!జస్ట్‌ 5 రూపాయలతో కూల్ కూల్ గా
మీ ఎయిర్ కూలర్‌ను ఏసీలా మార్చేయండి!జస్ట్‌ 5 రూపాయలతో కూల్ కూల్ గా