Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఆడుకుంటూ ఉండగా పాపకు విభిన్నంగా కనిపించిన రాయి.. ఆ తర్వాత తేలింది అదో అద్భుతం అని

మూడేళ్ల చిన్నారి తోబుట్టువులతో ఆడకుంటుండగా ఓ రాయి ప్రత్యేకంగా కనిపించటంతో సేకరించి.. తీసుకొచ్చి తల్లిదండ్రులకు ఇచ్చింది. వారు దానిపై ముద్రను చూసి ఏదో చారిత్రక వస్తువుగా భావించి.. పురావస్తు శాఖవారికి సమాచారమందించారు. వారు ఆ రాయిని పరిశీలించి.. అది వేల ఏళ్లనాటి ఈజిప్టియన్ (Egyptian) స్కార్బ్‌గా నిర్ధారించారు.

Viral: ఆడుకుంటూ ఉండగా పాపకు విభిన్నంగా కనిపించిన రాయి.. ఆ తర్వాత తేలింది అదో అద్భుతం అని
scarab amulet
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 05, 2025 | 4:40 PM

ఫ్యామిలీతో కలిసి ట్రిప్‌కి  వెళ్లిన మూడేళ్ల పాప రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయింది. అందుకు కారణం.. తను అక్కడ అత్యంత అరుదైన పురాతన వస్తువును కనుగొనడమే.  దీంతో ఆ పాపపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన ఇజ్రాయెల్ దేశంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్లితే.. దక్షిణ ఇజ్రాయెల్… తెల్ అజెకా అనే చారిత్రక ప్రాంత సందర్శనకు జివ్ నిట్జాన్ అనే మూడేళ్ల ఫ్యామిలీతో కలిసి వెళ్లింది. అక్కడ తను  ఆడకుంటుండగా ఓ రాయి ప్రత్యేకంగా అనిపించండంతో.. దాన్ని తీసకువచ్చి… తల్లిదండ్రులకు చూపించింది. వారు దాన్ని పురాతన వస్తువుగా గుర్తించి, ఇజ్రాయెల్ పురావస్తు అథారిటీకు అప్పగించారు.

పురావస్తు శాఖ వారు ఆ రాయిని పరిశీలించి, అది 3800 ఏళ్ల క్రితం నాటి ఈజిప్టియన్  సీల్డ్ ముద్రగా గుర్తించారు. అనంతరం చారిత్రక నేపథ్యం ఉన్న అరుదైన వస్తువును బాధ్యతగా ప్రభుత్వానికి అందించినందుకు జివ్ నిట్జాన్‌కు పురావస్తు శాఖ తరపున ప్రశంసా పత్రం ఇచ్చారు. ఈ వస్తువును ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనలో పెట్టనున్నట్లు పురావస్తు శాఖ తెలిపింది. ఇక ఈ  సీల్డ్ ముద్ర ఈజిప్ట్-కనాన్ సంబంధాలను తెలియజేస్తుందని, ఈజిప్ట్‌లో తయారైన ఈ వస్తువు పవిత్ర బీటిల్ చిహ్నంగా ఉందని పురావస్తు నిపుణురాలు డాఫ్నా బెన్-టోర్ చెప్పారు. మత విశ్వాసాలను ప్రతిబింబిస్తుందన్నారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి.