AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెరపైకి రూ.1000/- నోటు.. ఆర్బీఐ ఏమందంటే..?

సోషల్ మీడియా చేయడంతో ఏది నిజమో.. ఏది అబద్దమో తెలియకుండా పోతోంది. అందులో వస్తున్న వాటిని చూసి సామాన్య జనం నిజమేనేమో అనుకుంటున్నారు. కాదు కాదు.. అలా సోషల్ మీడియా నమ్మిచ్చేస్తోంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే.. కొత్త వెయ్యి రూపాయల నోటు మార్కెట్లోకి వచ్చిందంటూ ఆకతాయిలు పోస్ట్ చేశారు. అంతేకాదు.. ఆ కొత్త రూ.1000/- నోటు ఎలా ఉంటుందో కూడా.. ఓ ఎడిటింగ్ ఫోటోని చూపిస్తూ.. సోషల్ మీడియాలో […]

తెరపైకి రూ.1000/- నోటు.. ఆర్బీఐ ఏమందంటే..?
TV9 Telugu Digital Desk
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Oct 19, 2019 | 12:57 PM

Share

సోషల్ మీడియా చేయడంతో ఏది నిజమో.. ఏది అబద్దమో తెలియకుండా పోతోంది. అందులో వస్తున్న వాటిని చూసి సామాన్య జనం నిజమేనేమో అనుకుంటున్నారు. కాదు కాదు.. అలా సోషల్ మీడియా నమ్మిచ్చేస్తోంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే.. కొత్త వెయ్యి రూపాయల నోటు మార్కెట్లోకి వచ్చిందంటూ ఆకతాయిలు పోస్ట్ చేశారు. అంతేకాదు.. ఆ కొత్త రూ.1000/- నోటు ఎలా ఉంటుందో కూడా.. ఓ ఎడిటింగ్ ఫోటోని చూపిస్తూ.. సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత కొత్త వెయ్యి రూపాయల నోట్లను ఆర్బీఐ ముద్రిస్తోందని.. మార్కెట్లోకి విడుదల కూడా చేసిందని పోస్టులు పెడుతున్నారు. అయితే అది చూసిన జనమంతా నిజమేనేమో అనుకుంటూ.. బ్యాంకులను కూడా సంప్రదించడం మొదలెట్టారు. అక్కడ ఇక్కడ ఈ వార్త వైరల్‌గా మారి.. చివరకు ఆర్బీఐ వరకు చేరుకుంది.

వదంతులు వ్యాప్తిచెందుతున్నాయని.. అలర్ట్ అయిన ఆర్బీఐ ఇదంతా ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది. తాము కొత్త రూ.1000 నోట్ల విడుదల చేయలేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. 2016 నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు సమయంలో అప్పటి వరకు ఉన్న రూ.1000, రూ.500 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో కొత్త రూ.2000 నోటు, కొత్త రూ.500 నోటు మార్కెట్లోకి వచ్చాయి. ఆ తర్వాత రూ.200 నోటును కూడా ఆర్బీఐ తీసుకొచ్చింది. అయితే రూ.1000 నోటును మాత్రం ముద్రించలేదు. అయితే ఇటీవల కాలంలో మళ్లీ రూ.1000 నోటును ఆర్బీఐ ముద్రిస్తోందని, మార్కెట్లోకి రిలీజ్ చేసిందంటూ వార్త వైరల్ కావడంతో.. అంతా కన్ఫ్యూస్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ ఈ ప్రకటన చేసింది.