AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకల్లో సంచలనం..36 కోట్ల చీర బహుకరించిన వ్యాపారవేత్త!

ముంబై వ్యాపారవేత్త రోహిత్ పిసల్ మాతా రమాబాయి అంబేద్కర్ జయంతి సందర్భంగా 39 కోట్ల విలువైన బంగారు, వజ్రాల చీరను బహుమతిగా ఇచ్చి వార్తల్లో నిలిచారు. 2 కిలోల బంగారం, ఖరీదైన వజ్రాలతో తయారైన ఈ అద్భుత చీర, రమాబాయి త్యాగానికి నివాళి. గతంలో 10 కోట్ల బంగారు ఆపిల్‌తో రికార్డు సృష్టించిన పిసల్, సామాజిక ప్రాముఖ్యత కలిగిన కళాకృతులకు ప్రసిద్ధి. ఈ చీర ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకల్లో సంచలనం..36 కోట్ల చీర బహుకరించిన వ్యాపారవేత్త!
Most Expensive Saree In India
Jyothi Gadda
|

Updated on: Feb 11, 2026 | 5:43 PM

Share

కొంతమంది గొప్ప వ్యక్తుల జ్ఞాపకాలను సజీవంగా ఉంచడానికి శిల్పం, సాహిత్యం లేదా కళ ద్వారా వారికి నివాళులు అర్పిస్తారు. కానీ, ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, ఆభరణాల డిజైనర్ రోహిత్ పిసల్ ఈసారి అందరి దృష్టిని భిన్నంగా ఆకర్షించారు. రమాబాయి అంబేద్కర్ జయంతి (ఫిబ్రవరి 7) సందర్భంగా ఆయన రూ. 39 కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన బంగారు చీరను అందించారు. ప్రస్తుతం ఈ చీర అంతటా చర్చనీయాంశమైంది.

ముంబైకి చెందిన వ్యాపారవేత్త రోహిత్ పిసల్ ప్రస్తుతం రూ.39 కోట్లు (సుమారు $1.3 బిలియన్) విలువైన చీరను బహుమతిగా ఇవ్వటంతో వార్తల్లో నిలిచారు. ఈ చీర ఖరీదైనది మాత్రమే కాదు.. అత్యంత ప్రత్యేకమైనది. ఈ అద్భుతమైన చీర తయారీలో దాదాపు 2 కిలోల స్వచ్ఛమైన బంగారాన్ని ఉపయోగించారు. ఇది అరుదైన, ఖరీదైన వజ్రాలతో అతి సున్నితంగా పొదిగినది. ఈ చీర ఆధునిక సాంకేతికత, సాంప్రదాయ చేతిపనుల కలయిక. ఈ చీరను పూర్తి చేయడానికి దాదాపు 90 రోజులు పట్టింది. బంగారు పూత పని కేవలం 4 గంటల్లోనే పూర్తయింది. బాబా సాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ భార్య రమాబాయి అంబేద్కర్ జయంతి (ఫిబ్రవరి 7) నాడు రోహిత్ ఈ చీరను ఆమెకు అంకితం చేశాడు. ఇంతకీ ఎవరీ రోహిత్ పిసల్..? అతని పని గురించి తెలుసుకుందాం.

గోల్డ్‌మ్యాన్ గా ప్రసిద్ధి చెందిన రోహిత్ పిసల్ ఈ చీర కేవలం సంపదను ప్రదర్శించడానికి మాత్రమే కాదు. అత్యంత పేదరికంలో జీవించి తన కుటుంబం, శ్రేయస్సును సమాజం కోసం త్యాగం చేసిన రమాబాయి జ్ఞాపకార్థం కృతజ్ఞతా చిహ్నంగా ఈ కళాకృతిని అంకితం చేయబడిందని చెప్పారు. ఆమె త్యాగం విలువ ఎలాంటి వజ్రాలతోనూ వెల కట్టలేని గొప్పది అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

రోహిత్ పిసల్ గతంలో రూ. 10 కోట్ల విలువైన బంగారు ఆపిల్‌ను తయారు చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. ఈ కళాకృతిని థాయిలాండ్ రాయల్ ప్యాలెస్‌లో కూడా ప్రదర్శించారు. సామాజిక, సాంస్కృతిక ప్రాముఖ్యత ఆధారంగా ప్రత్యేకమైన కళాకృతులను రూపొందించడంలో ఆయన ప్రసిద్ధి చెందారు.

ఈ రూ.39 కోట్ల బంగారు, వజ్రాల చీర ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరు దీనిని గొప్ప గౌరవంగా ప్రశంసించగా, మరికొందరు దీని ధర పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఈ చీర ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షించిందన్నది నిజం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us