AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: బతికి ఉన్న 15 రోజుల శిశువును పూడ్చిన తండ్రి.. కారణం ఇదే!

అందరి జీవితాలు ఒక్కలాగే ఉండవు. వారి కుటుంబ పరిస్థితుల కారణంగా అనేక ఘటనలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. బాధలను దిగమింగి.. ఎలాంటి కష్టాలను అయినా భరించాల్సి ఉంటుంది. మనసును కలచివేసే ఎన్నో సంఘటనల గురించి వినే ఉంటారు. సోషల్ మీడియా ద్వారా తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ న్యూస్ వింటే ఎలాంటి వారైనా విచారం వ్యక్తం చేస్తారు. బిడ్డలు లేక ఎంతో మంది అల్లాడుతూ ఉంటారు. కానీ పెంచే స్థోమత లేక చాలా మంది పసి బిడ్డలను..

Viral News: బతికి ఉన్న 15 రోజుల శిశువును పూడ్చిన తండ్రి.. కారణం ఇదే!
Viral News
Chinni Enni
|

Updated on: Jul 08, 2024 | 1:42 PM

Share

అందరి జీవితాలు ఒక్కలాగే ఉండవు. వారి కుటుంబ పరిస్థితుల కారణంగా అనేక ఘటనలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. బాధలను దిగమింగి.. ఎలాంటి కష్టాలను అయినా భరించాల్సి ఉంటుంది. మనసును కలచివేసే ఎన్నో సంఘటనల గురించి వినే ఉంటారు. సోషల్ మీడియా ద్వారా తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ న్యూస్ వింటే ఎలాంటి వారైనా విచారం వ్యక్తం చేస్తారు. బిడ్డలు లేక ఎంతో మంది అల్లాడుతూ ఉంటారు. కానీ పెంచే స్థోమత లేక చాలా మంది పసి బిడ్డలను వదిలి పెట్టడం లేదా చంపేయడం జరుగుతూ ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా.. తనకు పెంచే పరిస్థితి లేకపోవడంతో ఒక తండ్రి తన 15 కుమార్తెన సజీవంగా పాతి పెట్టాడు. ఈ ఘటన పాకిస్తాన్‌లోని సింధ్‌లో జరిగింది.

పాకిస్తాన్ వార్తా ఛానెల్స్ ప్రకారం.. పాకిస్తాన్ సింధ్ ప్రాంతానికి చెందని తయ్యబ్ అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల కారణంగా 15 రోజుల పసిబిడ్డను సజీవంగా పూడ్చి పెట్టినట్లు వెల్లడించాడు. తన నవజాత శిశువును పాతి పెట్టే ముందు గోనె సంచిలో ఉంచినట్లు తయ్యబ్.. పోలీసులకు వివరించాడు. శిశువుకు అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయని, శిశువుకు చికిత్స చేయించే స్థోమత మా దగ్గర లేదని అందుకే ఇలాంటి పని చేయాల్సి వచ్చిందని అతను వాపోయాడు. దీంతో తయ్యబ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఫోరెన్సిక్ టెస్ట్, పోస్టు మార్టం ప్రక్రియల కోసం శిశువు సమాధిని తీయడానికి కోర్టు ఆదేశం కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియోలో వైరల్‌గా మారింది. ఈ న్యూస్ తెలిసిన వాళ్లందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.