AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పునాది పనిలో బయటపడిన లంకె బిందె..! లోపల ఉన్నది చూస్తే..

ఊహించుకోండి.. మీరు కొత్తగా ఇల్లు కట్టుకోబోతున్నారు. ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుండగా లక్షల విలువైన నిధి దొరికితే ఎలా ఉంటుంది..? మీ ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. అది మీకు చాలా మంచి రోజు అవుతుంది. అలాంటి సంఘటన ఒకటి కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసింది. గడగ్ జిల్లాలోని చారిత్రాత్మక లక్కుండి గ్రామంలో ఒకరికి అదృష్ట నిధి లభించింది. దాంతో వారు ఏం చేశారో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే....

పునాది పనిలో బయటపడిన లంకె బిందె..! లోపల ఉన్నది చూస్తే..
Historic Village Of Lakkundi
Jyothi Gadda
|

Updated on: Jan 14, 2026 | 9:46 PM

Share

కర్ణాటకలోని గడగ్‌ జిల్లాలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది.దేవాలయాలు, చాళుక్య యుగం వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందినది ఈ ప్రాంతం. ఇటీవల ఇక్కడ పురాతన బంగారు ఆభరణాల పెద్ద నిధిని గుర్తించటం విస్తృత చర్చకు దారితీసింది. ఈ నిధి జనవరి 10 శనివారం రోజున ఒక నివాస స్థలం పునాది తవ్వకం సమయంలో బయటపడింది. పునాది తవ్వుతుండగా రాగి కుండలో భద్రపరిచిన బంగారు నిధి బయటపడింది. ప్రజ్వల్ అనే 8వ తరగతి విద్యార్థి మొదట దీనిని గమనించి అందరికీ సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు నిజాయితీగా పోలీసులకు, జిల్లా యంత్రాంగానికి తెలియజేశారు. ఆ నిధిని అప్పగించారు. ఈ చర్యకు ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఇదిలా ఉండగా, మీడియాతో మాట్లాడిన గడుగన జిల్లా మేజిస్ట్రేట్ సి.ఎన్. శ్రీధర్ మాట్లాడుతూ..”జనవరి 10న లక్కుండి గ్రామంలో రిట్టి ఇంటి పునాదిని తొలగిస్తుండగా బంగారు నిధి బయటపడిందని చెప్పారు. ఆయన కుమారుడు ప్రజ్వల్ అందరికీ సమాచారం అందించాడు. దీని గురించి సీఎంతో మాట్లాడినప్పుడు, దానిని భద్రపరచాలని ఆయన ఆదేశించారు. దొరికిన బంగారు నిధి ప్రస్తుతం జిల్లా పరిపాలన ఖజానాలో ఉందని తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

భారత పురావస్తు సర్వే అధికారి రమేష్ మూలిమణి తన ప్రకటనతో గందరగోళం సృష్టించారు. ఆ భూమిలో రూ. 10 కంటే ఎక్కువ విలువైనది ఏదైనా దొరికితే, అది ప్రభుత్వానికి చెందినదిగా ప్రకటించారు. ఆ నిధి గురించి నిపుణులైన అధికారుల నేతృత్వంలో దర్యాప్తు జరుగుతుందని చెప్పారు.. ఆ తర్వాత, అది ఎవరిది, ఏ కాలం నాటిదో గుర్తించేందుకు వీలుగా ఉంటుందని చెప్పారు. నిబంధనల ప్రకారం..ఆ భూమిని ఆక్రమించాల్సి వస్తే అది కూడా చేస్తామని ఆయన తెలియజేశారు.

ఇకపోతే, అక్కడ దొరికిన నిధి వివరాలను కూడా వెల్లడించారు. అక్కడ లభించిన మొత్తం బంగారం బరువు సుమారు 470 గ్రాములుగా గుర్తించారు.

అందులో 1 బ్రాస్లెట్ ముక్క – 33 గ్రాములు

1 నెక్లెస్ ముక్క – 12 గ్రాములు 1

నెక్లెస్ ముక్క – 44 గ్రాములు 1

నెక్లెస్ ముక్క – 137 గ్రాములు 49 గ్రాములు 5 పెద్ద బుల్లెట్లు – 34 గ్రాములు 2 పెద్ద బుల్లెట్లు – 17 గ్రాములు 1 పెద్ద బుల్లెట్లు, 1 చిన్న బుల్లెట్లు – 11 గ్రాములు (రెండు సెట్లు ) 23 గ్రాములు 3 – 3 గ్రాములు 22 చిల్లులు గల ప్లేట్లు – 48 గ్రాములు 1 శిథిలమైన కుండ, 1 మూత మరియు 3 చిన్న ముక్కలు – 634 గ్రాములు (రాగి కుండతో సహా)

View this post on Instagram

A post shared by Mo (@mo.of.everything)

ఇప్పుడు ఈ నిధి విలువ దాదాపు 60-70 లక్షల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు. ఇప్పుడు ఈ నిధి జిల్లా పరిపాలన ఖజానాలో సురక్షితంగా భద్రపరిచారు. పురావస్తు శాఖ నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది నిధినా లేక పూర్వీకుల ఆస్తినా అనేది దర్యాప్తు తర్వాత తెలుస్తుంది. ఇదిలా ఉండగా, నిధిని అప్పగించిన కుటుంబానికి మానవతా దృక్పథంతో సహాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.