ఇదే మరీ పిచ్చి అంటే.. భక్తి పేరిట శివుడికి నాలుక కోసి సమర్పించుకున్న బాలిక.. చివరకు ఏమైందంటే..
మూఢ భక్తితో ఆమె తన నాలుక కోసి శివ లింగానికి సమర్పించుకుంది. అనంతరం ఆమె ధ్యానంలోకి వెళ్లిపోయింది. అయితే, ఈ వార్త అన్ని సోషల్ మీడియా అన్ని ప్లాట్ఫామ్లలో వేగంగా వైరల్ అవయింది. దీంతో బాలిక దైవభక్తి పిచ్చి పీక్ స్టేజీకి చేరిందంటూ నెటిజన్లు మండిపడ్డారు.. బాలికతో పాటు గ్రామస్థులకు కౌన్సిలింగ్ ఇప్పించాలని కోరుతూ పలువురు కామెంట్ల రూపంలో కోరుతున్నారు.

2024 చివరి రోజున ఛత్తీస్గఢ్లోని శక్తి జిల్లాలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అయితే, ఈ సంఘటన వార్త మాత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్గఢ్లోని శక్తి జిల్లాలో ఒక గ్రామంలో 11వ తరగతి చదువుతున్న ఓ విద్యార్ధిని ఎవరూ ఊహించని పని చేసింది. మూఢ భక్తితో ఆమె తన నాలుక కోసి శివ లింగానికి సమర్పించుకుంది. అనంతరం ఆమె ధ్యానంలోకి వెళ్లిపోయింది. ధ్యానం కోసం ఆలయంలోకి వెళ్లి.. తనకు తాను లోపలి నుంచి తాళం వేసుకుంది. రెండు రోజుల వరకు తన ధ్యానానికి భంగం కలిగిస్తే తన జీవితాన్ని అంతం చేసుకుంటానని బెదిరించింది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో గ్రామస్థులు గుడి చుట్టూ చేరగా, జిల్లా యంత్రాంగం, పోలీసుల బృందాలు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే, బాలిక ఏదైనా కఠిన చర్యలు తీసుకుంటుందనే భయంతో గ్రామస్థులు అధికారులను ఆలయంలోకి రానీయకుండా అడ్డుకున్నారు.
అదృష్టవశాత్తు ఎలాగోలా యువతిని బయటకు తీసిన పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ఆమె ప్రస్తుతం భోజనం తింటుందని, ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు.
అయితే, ఈ వార్త అన్ని సోషల్ మీడియా అన్ని ప్లాట్ఫామ్లలో వేగంగా వైరల్ అవయింది. దీంతో బాలిక దైవభక్తి పిచ్చి పీక్ స్టేజీకి చేరిందంటూ నెటిజన్లు మండిపడ్డారు.. బాలికతో పాటు గ్రామస్థులకు కౌన్సిలింగ్ ఇప్పించాలని కోరుతూ పలువురు కామెంట్ల రూపంలో కోరుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..