AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: కంటి నొప్పితో ఆస్పత్రికెళ్లిన యువకుడు.. స్కాన్ చేయగా ఖంగుతిన్న డాక్టర్లు..

ఓ వ్యక్తి కంటి నొప్పితో ఆసుపత్రికి వెళ్లాడు. అదేంటో తెలుసుకునేందుకు డాక్టర్లు పలు టెస్టులు నిర్వహించారు...

Viral: కంటి నొప్పితో ఆస్పత్రికెళ్లిన యువకుడు.. స్కాన్ చేయగా ఖంగుతిన్న డాక్టర్లు..
Representative Image 1
Ravi Kiran
|

Updated on: Aug 12, 2022 | 1:04 PM

Share

డాక్టర్లు ఎప్పటికప్పుడు అరుదైన శస్త్రచికిత్సలను నిర్వహిస్తుంటారు. అప్పటిదాకా వారు చేయనటువంటి ఆపరేషన్లను విజయవంతంగా చేస్తుండటాన్ని మనం చూస్తూనే ఉంటాం. అలాంటిదే ఇది కూడా.  ఓ వ్యక్తి కంటి నొప్పితో ఆసుపత్రికి వెళ్లాడు. అదేంటో తెలుసుకునేందుకు డాక్టర్లు పలు టెస్టులు నిర్వహించారు. ఇందులో భాగం అతడు స్కానింగ్ చేయించుకోగా.. వాటి రిపోర్టులను చూడగానే వైద్యులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఇంతకీ ఆ కథేంటంటే..

వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ఛతీస్‌గఢ్ వైద్యులు ఓ అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించారు. సుమారు ఐదు నెలల కిందట ఓ 30 ఏళ్ల యువకుడు బైక్ యాక్సిడెంట్‌కు గురయ్యాడు. హెల్మెట్ లేకపోవడంతో అతడి కంటి కింద తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ సమయంలో డాక్టర్లు గాయాలైన చోట కుట్లు వేసి పంపించారు. అయితే అది కాస్తా బెడిసికొట్టింది.

కుడి కంటి కింద గాయానికి చీము రావడం మొదలైంది. తీవ్రమైన నొప్పి కూడా వస్తుండటంతో అతడు మరోసారి చికిత్స నిమిత్తం డాక్టర్లను సంప్రదించాడు. వైద్యులు సీటీ స్కాన్ నిర్వహించగా.. అతడి కంటి కింద సుమారు 4 అంగుళాల పొడవున్న పుల్లలను గుర్తించారు. గంటన్నర పాటు ఆపరేషన్ చేసి.. వాటిని బయటికి తీశారు. బాధితుడి ఆరోగ్యం బాగానే ఉందని.. ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు.

Eye Operation

 

ఇది చదవండి: టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..