Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kachidi Fish: ఒక్క చేపతో వారి సుడి తిరిగింది.. ఎంతకు అమ్మారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఏ రోజుకు ఆ రోజు వచ్చే సంపాదనతో తమ బ్రతుకు బండిని కొనసాగిస్తారు మత్స్యకారులు. అయితే ఏదొక రోజు ఓ భారీ చేప పడిందంటే చాలు..

Kachidi Fish: ఒక్క చేపతో వారి సుడి తిరిగింది.. ఎంతకు అమ్మారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Fish
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 30, 2021 | 10:17 AM

ఏ రోజుకు ఆ రోజు వచ్చే సంపాదనతో తమ బ్రతుకు బండిని కొనసాగిస్తారు మత్స్యకారులు. అయితే ఏదొక రోజు ఓ భారీ చేప పడిందంటే చాలు.. వాళ్ల లైఫ్ సెటిల్ అయినట్లే. ఈ మధ్యకాలంలో ఇలాంటి వార్తలు చాలానే వింటున్నాం. అచ్చం ఇలానే ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా‌కు చెందిన రామకృష్ణ, రాంబాబు అనే మత్స్యకారులు భారీ కచిది చేపను పట్టుకుని ఒక్క రోజులో ధనవంతులుగా మారిపోయారు.

వివరాల్లోకి వెళ్తే.. సఖినేటిపల్లి మండలం అంతర్వేది ఫిషింగ్ హార్బర్‌లో చేపలను వేటాడటానికి వెళ్లిన బస్వాని రామకృష్ణ, రాంబాబు అనే ఇద్దరు మత్స్యకారుల వలకు 40 కేజీల బరువు ఉన్న కచిది చేప చిక్కింది. ఈ కచిది చేపలో విరివిగా ఔషధ గుణాలు ఉంటాయి. పొలుసు దగ్గర నుంచి చేపలోని ప్రతీ భాగం ఎంతో విలువైనది. మందుల తయారీలో ఈ చేప నుంచి తీసుకున్న పదార్ధాలను వినియోగిస్తుంటారు.

ఈ కచిది చేపకు మద్రాస్ మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి అరుదైన చేప ఒక్కసారైనా తమ వలకు చిక్కాలని చాలామంది మత్స్యకారులు కోరుకుంటారు. ఇక తాజాగా బస్వాని రామకృష్ణ, రాంబాబుల వలకు 40 కేజీల కచిది చేప దొరికింది. ఈ భారీ చేపను దళారీ తురమాని ఆచార్యులు రూ. 2.70 లక్షలకు దక్కించుకున్నాడు.