AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: హాయిగా నిద్రపోయింది.. రూ. 5 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకుంది.. ఎలాగో తెలిస్తే షాకే.!

నెల జీతం కోసం కంటి నిండా నిద్రలేకుండా కష్టపడుతుంటాం. అయితే ఇక్కడొక యువతి కావల్సినంత సమయాన్ని నిద్రకు వెచ్చించి..

Viral: హాయిగా నిద్రపోయింది.. రూ. 5 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకుంది.. ఎలాగో తెలిస్తే షాకే.!
Sleep Internship
Ravi Kiran
|

Updated on: Sep 06, 2022 | 5:05 PM

Share

నెల జీతం కోసం కంటి నిండా నిద్రలేకుండా కష్టపడుతుంటాం. అయితే ఇక్కడొక యువతి కావల్సినంత సమయాన్ని నిద్రకు వెచ్చించి.. ఏకంగా రూ. 5 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకుంది. అంతేకాదు ‘భారత తొలి స్లీప్ ఛాంపియన్‌’ టైటిల్‌ను కూడా సొంతం చేసుకుంది. అసలేం చెబుతున్నాం.? నిద్రపోతే లక్షలు గెలవడమేంటి.? ఇంతకీ ఆ పోటీ ఏంటి.? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన వేక్‌ఫిట్ మ్యాట్రస్ సంస్థ ప్రతీ ఏటా స్లీప్ ఇంటర్న్‌షిప్ అనే పోటీ నిర్వహిస్తోంది. నిద్రను ప్రోత్సహించడంలో భాగంగా వారు ఈ పోటీని నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో పాల్గొనేవారు 100 రోజుల పాటు డైలీ 9 గంటల చొప్పున కంటి నిండా నిద్రపోవాలి. చివరి రౌండ్‌కు నలుగురిని ఎంపిక చేసి.. వారి నిద్ర నాణ్యతను బట్టి ఒకరిని విజేతగా ప్రకటిస్తారు.

ఈ క్రమంలోనే గతేడాది నిర్వహించిన పోటీల్లో కోల్‌కతాకు చెందిన త్రిపర్ణా చక్రవర్తి 95 శాతం స్లీప్ ఎఫిషియెన్సీ స్కోర్‌ సాధించి 5 లక్షల రూపాయలు గెలుచుకుంది. అంతేకాకుండా భారత తొలి స్లీప్ ఛాంపియన్ టైటిల్‌ను కూడా సొంతం చేసుకుంది. అలాగే లాస్ట్ రౌండ్‌కు వచ్చిన మిగతా ముగ్గురికి చెరో లక్ష రూపాయలు ఇచ్చారు వేక్‌ఫిట్ సంస్థ నిర్వాహకులు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

Follow Us