AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chai Samosa : వామ్మో.. ఎయిర్‌పోర్ట్‌లో చాయ్‌, సమోసా ఖరీదు రూ.490.. బిల్లు చూసి షాకవుతున్న నెటిజన్లు..!

ఈ ఫోటోలో 1 టీ, రెండు సమోసాలు, ఒక వాటర్ బాటిల్ ధర చూసి నెటిజన్లు కంగుతిన్నారు. ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారిన ఈ బిల్లు కాఫీ మైక్రోబ్లాగింగ్ సైట్‌లో షేర్‌ చేశారు. దానిపై వందలాది మంది వినియోగదారులు వ్యాఖ్యానించారు. కొంతమంది వినియోగదారులు స్పందిస్తూ.. ఇలా రాశారు.. మీకు సామర్థ్యం లేనప్పుడు విమానంలో ఎందుకు వెళ్లాలంటూ కొందరు వ్యాఖ్యనించారు. అయితే దీనిపై సదరు వ్యక్తి కూడా స్పందించాడు. చాలా మంది ప్రతిస్పందనలకు సమాధానంగా, అతను ఇలా వ్రాశాడు

Chai Samosa : వామ్మో.. ఎయిర్‌పోర్ట్‌లో చాయ్‌, సమోసా ఖరీదు రూ.490.. బిల్లు చూసి షాకవుతున్న నెటిజన్లు..!
Airport Food Bill
Jyothi Gadda
|

Updated on: Nov 01, 2023 | 6:09 PM

Share

మాల్స్‌, సినిమా హాళ్లు, ఎయిర్‌పోర్టుల్లో ఏవైనా స్నాక్స్‌, టీ వంటివి తీసుకోవాలంటే సామాన్యులు ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే.. బయట తక్కువ ధరలో లభించే ఆహార పదార్థాలు కూడా ఇలాంటి చోట చాలా ఖరీదు వసూలు చేస్తుంటారు. ప్రస్తుతం అలాంటిదే ఇక్కడ ఒక ఎయిర్‌పోర్ట్‌ ఫుడ్ బిల్లు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఫోటోలో 1 టీ, రెండు సమోసాలు, ఒక వాటర్ బాటిల్ ధర దాదాపు రూ.500 అని రాసి ఉంది. అయితే ఈ విషయం వైరల్ కావడంతో ఓ ట్విటర్ యూజర్ ఈ ఫోటోలోని నిజాన్ని బయటపెట్టారు. ఇంతకీ అసలు విషయం ఏంటీ..? ఇక్కడ పోస్ట్‌ చేసిన బిల్లు ఏ ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించినదో ఇక్కడ తెలుసుకుందాం..

ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారిన ఈ బిల్లు కాఫీ మైక్రోబ్లాగింగ్ సైట్‌లో షేర్‌ చేశారు. ముంబై నుంచి కోల్‌కతాకు విమాన టికెట్ రూ.9,230. క్యాబ్ డ్రైవర్ రూ.1500 తీసుకున్నాడు. ఒకసారి ఇంటికి చేరుకోవడానికి మొత్తం ఖర్చు రూ.11,220. ఇది నా నెల జీతం రూ.17,000. కాగా, నా సంపాదనపై ఆధారపడిన కుటుంబం 100 కోట్ల జనాభాలో హిందువులలో నేనూ ఒకడిని. హిందువులు నిజంగా ప్రమాదంలో ఉన్నారు! అంటూ అతడు ఈ పోస్ట్‌ శీర్షికలో రాసుకొచ్చారు. ఇక సోషల్ మీడియాలో ఈ పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటికే దాదాపు ఎనిమిదిన్నర వేలకు పైగా లైక్‌లు, సుమారు 10లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియా వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో షేర్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

దానిపై వందలాది మంది వినియోగదారులు వ్యాఖ్యానించారు. కొంతమంది వినియోగదారులు స్పందిస్తూ.. ఇలా రాశారు.. మీకు సామర్థ్యం లేనప్పుడు విమానంలో ఎందుకు వెళ్లాలంటూ కొందరు వ్యాఖ్యనించారు. అయితే దీనిపై సదరు వ్యక్తి కూడా స్పందించాడు. చాలా మంది ప్రతిస్పందనలకు సమాధానంగా, అతను ఇలా వ్రాశాడు ఆహారం, విమాన టిక్కెట్లు లేదా క్యాబ్ ఛార్జీల ద్రవ్యోల్బణాన్ని ఎవరూ చూడటం లేదు, అందరూ నా జీతం చూసి నాకు ఇంత తక్కువ జీతం ఎందుకు అని అడుగుతున్నారంటూ చెప్పుకొచ్చాడు. అయితే వార్త పాతదే అయినప్పటికీ ప్రస్తుతం మరో నెట్టింట వైరల్ అవుతోంది.

‘Poha Jalebi’ (@poha_met_jalebi) అనే వినియోగదారు 2022 నుండి చేసిన ట్వీట్ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేసి ఇలా వ్రాశారు – హలో బ్రదర్‌.. సమోసా మీకు చేరడానికి 10 నెలలు పట్టింది. ముందుగా అది బాగుందో లేక పాడైపోయిందో చూసుకోండి అంటూ ఒక వినియోగదారు కామెంట్ చేయగా,.. ఇది కేవలం సోషల్ మీడియా పోస్ట్‌ మాత్రమే.. మీరు ఇటీవల ఎప్పుడైనా విమానాశ్రయానికి వెళ్లారా? వస్తువుల ధరలు చూశారా? ఒక వారం ముందుగానే విమాన టిక్కెట్‌ను బుక్ చేసుకోవడానికి ఎంత ఖర్చవుతుంది? మీ నగరంలో క్యాబ్ ధరలు ఎంత? నేను ఇచ్చిన రేటు అసలైన రేటు !! ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఈ మొత్తం విషయంపై మీ అభిప్రాయం ఏంటో మీ కామెంట్‌ ద్వారా తెలియజేయండి అంటున్నారు చాలా మంది నెటిజన్లు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..