AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వంట చేద్దామని కిచెన్‌లోకి వెళ్లింది..! గిన్నెలో ఉన్నవి చూసి.. ఒక్కసారిగా..

ఘాజీపూర్‌లోని పాండే కాపురా గ్రామంలో రాజేష్ పాండే ఇంట్లో పది నాగుపాములు కనిపించడంతో కుటుంబం తీవ్ర భయాందోళనకు గురైంది. మొదట వంటగది లో ఒక పాము కనిపించింది. పాములను పట్టుకునే వ్యక్తిని పిలిపించగా, అతను మొత్తం పది పాముల ను పట్టుకున్నాడు.

వంట చేద్దామని కిచెన్‌లోకి వెళ్లింది..! గిన్నెలో ఉన్నవి చూసి.. ఒక్కసారిగా..
Snakes
SN Pasha
|

Updated on: Jul 20, 2025 | 2:03 PM

Share

ఎవరి ఇంట్లోనైనా ఒక్క పాము వస్తేనే భయపడతారు. అదే పదుల సంఖ్యలో పాములు, అవి కూడా నాగుపాము జాతికి చెందినవి కనిపిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఘాజీపూర్‌లోని బహ్రియాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని పాలివర్ గ్రామ పంచాయతీలోని పాండే కా పురా గ్రామంలో అదే జరిగింది. ఇక్కడి ఓ వ్యక్తి ఇంట్లో ఏకంగా 10 నాగుపాములు కనిపించడంతో గ్రామంలో గందరగోళం నెలకొంది. రాజేష్ పాండే ఇంట్లో మొత్తం పది పాములు కనిపించడంతో ఆ కుటుంబం భయాందోళనకు గురైంది. కుటుంబ సభ్యులందరూ రాత్రంతా ఇంటి బయటే ఉండి, పరిసరాల్లోనే ఆహారం తిన్నారని తెలుస్తోంది. శనివారం ఇంట్లో మరో పాము కనిపించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు.

నిజానికి రాజేష్ పాండే భార్య మాయా పాండే శుక్రవారం ఉదయం వంటగదిలోకి వెళ్లి ఒక పామును చూసింది, ఆ తర్వాత ఆమె భయంతో బయటకు వచ్చింది. తర్వాత ఆమె చుట్టుపక్కల వారికి విషయం చెప్పింది. వారు వంటగదిలోకి వెళ్లి చూశారు. అక్కడ పాము తన పడగను పైకి లేపి కూర్చుని ఉంది. లోపలికి వెళ్లడానికి లేదా దానిని చంపడానికి ఎవరికీ ధైర్యం సరిపోలేదు. తరువాత అజంగఢ్‌లోని విజయ్‌పూర్ గ్రామం నుంచి పాములు పట్టుకునే వ్యక్తిని పిలిపించారు. మొదట అతను వంటగదిలో పామును పట్టుకుని ప్లాస్టిక్ పెట్టెలో వేసి తాళం వేశాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు మరిన్ని పాములు కూడా ఉన్నాయొమో అని అనుమానం వ్యక్తం చేశారు. పాములు పట్టుకునే వ్యక్తి ఇతర గదుల నుండి మరో రెండు పాములను పట్టుకున్నాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి