AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీడు మనిషి కాదు మృగం.. రెండేళ్లుగా భార్యకు తిండి పెట్టకుండా టార్చర్.. చివరకు..

రెండేళ్లుగా తల్లిదండ్రులు తమ కుమార్తెను చూడలేదు. ఒక్కసారిగా అల్లుడు ఫోన్‌ చేసి మెట్ల మీద నుంచి పడిపోయిందని.. ఆసుపత్రిలో చేర్పించామని చెప్పడంతో తల్లిదండ్రులు వెళ్లారు.. అక్కడ ఎముకల గూడులా మారి.. విగతజీవిగా పడి ఉన్న తమ కుమార్తెను చూసి తల్లడిల్లిపోయారు. గుండెలవిసేలా రోదించారు. అల్లుడే తమ బిడ్డకు తిండి పెట్టకుండా హింసించి హత్య చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వీడు మనిషి కాదు మృగం.. రెండేళ్లుగా భార్యకు తిండి పెట్టకుండా టార్చర్.. చివరకు..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Aug 25, 2025 | 12:41 PM

Share

రెండేళ్లుగా తల్లిదండ్రులు తమ కుమార్తెను చూడలేదు. ఒక్కసారిగా అల్లుడు ఫోన్‌ చేసి మెట్ల మీద నుంచి పడిపోయిందని.. ఆసుపత్రిలో చేర్పించామని చెప్పడంతో తల్లిదండ్రులు వెళ్లారు.. అక్కడ ఎముకల గూడులా మారి.. విగతజీవిగా పడి ఉన్న తమ కుమార్తెను చూసి తల్లడిల్లిపోయారు. గుండెలవిసేలా రోదించారు. అల్లుడే తమ బిడ్డకు తిండి పెట్టకుండా హింసించి హత్య చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దారుణ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలో చోటుచేసుకుంది.

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ముచ్చవరం పంచాయతీ పరిధిలోని విశ్వన్నాథంపురానికి చెందిన లక్ష్మీప్రసన్న (33) ను అదే మండలానికి చెందిన పూల నరేశ్‌బాబుకు ఇచ్చి 2015లో వివాహం చేశారు. తొమ్మిదేళ్ల క్రితం వారికి కుమార్తె పుట్టింది. తర్వాత నరేశ్‌బాబు ఆరేళ్లపాటు భార్యతో కలిసి అత్తగారింట్లోనే ఉన్నాడు. మూడేళ్ల తర్వాత భార్యాబిడ్డలతో కలిసి అశ్వారావుపేటకు వచ్చి అక్కాబావల ఇంట్లో ఉంటున్నారు.

శనివారం నరేశ్‌ అత్తామామలకు ఫోన్‌ చేసి.. లక్ష్మీప్రసన్న ఇంట్లో మెట్ల పైనుంచి కిందపడటంతో గాయాలయ్యాయని, ఆసుపత్రిలో చేర్పించామని చెప్పాడు. దగ్గర్లోని రాజమహేంద్రవరం ఆసుపత్రిలో చికిత్స జరుగుతుందని చెప్పాడు.. దీంతో వారు ఆసుపత్రికి వెళ్లి చూడగా అప్పటికే లక్ష్మీప్రసన్న మృతిచెందింది. శరీరమంతా కొత్త గాయాలు, మానిన గాయాల గుర్తులు ఉండటం చూసి తల్లడిల్లిపోయారు. లక్ష్మీప్రసన్నను అదనపు కట్నం కోసం నరేశ్‌బాబు, అతని తల్లి విజయలక్ష్మి, అక్క దాసరి భూలక్ష్మి, బావ శ్రీనివాసరావు హింసించేవారని ఆరోపించారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అన్నం పెట్టకుండా చంపాడు..

అయితే.. లక్ష్మీ ప్రసన్న ఎముకల గూడులా మారి.. చనిపోయి ఉందని.. కాసేపు ఆమెను గుర్తుపట్టలేకపోయామని తల్లిదండ్రులు కంటతడి పెడుతూ తెలిపారు.. వివాహ సమయంలో రెండెకరాల మామిడితోటతోపాటు.. అరెకరం పొలం, 20 లక్షల కట్నకానుకలు ఇచ్చామని.. రెండేళ్ల నుంచి లక్ష్మీ ప్రసన్నను చూపించలేదని, ఫోన్ చేసినా మట్లాడనివ్వలేదని తల్లిదండ్రులు తెలిపారు. ఆమెను గృహ నిర్బంధం చేసి అన్నం పెట్టకుండా చంపేశాడంటూ లక్ష్మీప్రసన్న తల్లిదండ్రులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..