తెలుగు ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వినాయక నవరాత్రుల గిఫ్ట్ అందించారు. ప్రజల రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే ఉద్దేశంతో.. రైలు కనెక్టివిటీని మరింత పెంచుతున్నారు. ఈ మేరకు కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. వందేభారత్ రైళ్ల పరంపరలో భాగంగా.. మరో రెండు రైళ్లను తెలుగు రాష్ట్రాలకు కేటాయిస్తూ ప్రధాని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే 4 వందేభారత్ రైళ్లు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి సర్వీసులు అందిస్తుండగా.. తాజాగా 5వ వందేభారత్ రైలును కూడా ప్రధాని కేటాయించారని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ రైలు సికింద్రాబాద్, నాగ్పూర్ మధ్య సేవలు అందించనుంది. ఇదే క్రమంలో విశాఖ, దుర్గ్ (ఛత్తీస్గఢ్) మధ్య మరో వందేభారత్ ట్రైన్ అందుబాటులోకి రానుంది. ఈ రెండు రైళ్లను సెప్టెంబర్ 16న ప్రధానమంత్రి అహ్మదాబాద్ నుంచి లాంచనంగా ప్రారంభించనున్నారు. ఆ రోజు ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా 10 వందేభారత్ ట్రైన్స్కు పచ్చజెండా ఊపనున్నారు.
సామాన్య ప్రజలకు వందే భారత్ ట్రైన్స్ అనువుగా ఉండటంతో.. ఎక్కువమంది ఆదరిస్తున్నారని , 2024- 2025 ఆర్థిక సంవత్సరంలో 100 శాతం కంటే ఎక్కువ ఆక్యుపెన్సీ ఉండటం కారణంగా.. కేంద్ర ప్రభుత్వం ఈ రైళ్లతో వీలైనన్ని ప్రాంతాలను అనుసంధానించేందుకు ప్రణాళికలు రూపొందిస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు.
సికింద్రాబాద్- నాగ్పూర్ వందేభారత్ ట్రైన్.. నాగ్పూర్ నుండి మార్నింగ్ 5:00 గంటలకు స్టార్టయ్యి మధ్యాహ్నం 12:15 గంటలకు సికింద్రాబాద్ రీచ్ అవుతుంది. రిటన్ జర్నీలో సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 1:00 గంటలకు బయలుదేరి రాత్రి 8:20 గంటలకు నాగ్పూర్ రీచ్ అవుతుంది. 578 కిలోమీటర్ల ప్రయాణాన్ని 7.15 గంటల్లో కంప్లీట్ చేయనుంది. ఈ ట్రైన్కు కాజీపేట, రామగుండం, బల్హర్షా, చంద్రాపూర్, సేవాగ్రామ్ స్టేషన్లలో హాల్టింగ్ ఉంది.
అటు ఏపీ ప్రజల కోసం..విశాఖ నుంచి ఛత్తీస్గఢ్ లోని దుర్గ్ ప్రాంతానికి వెళ్లనున్న వందేభారత్ ఎక్స్ప్రెస్.. రాయ్పూర్, మహాసముంద్, ఖరియార్ రోడ్, కాంతబంజి, తిత్లాగఢ్, కేసింగా, రాయగడ, విజయనగరం మీదుగా విజాగ్ రీచ్ అవ్వనుంది. ఈ సర్వీస్ మూడు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా) పాసింజర్స్కు సర్వీసు అందిస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు.
I extend my gratitude to Hon'ble PM Shri @narendramodi ji and Union Minister for Railways Shri @AshwiniVaishnaw ji for gifting the Telugu states two new Vande Bharat trains.
These modern, semi-high-speed trains will not only enhance connectivity between key cities but also… pic.twitter.com/15yXVA1b64
— G Kishan Reddy (@kishanreddybjp) September 13, 2024
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..