AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆస్పత్రి ఖర్చులకి కూడా డబ్బు లేక మాజీ ఎమ్మెల్యే కొడుకు మరణం

ఆస్పత్రి ఖర్చులు కూడా లేక మాజీ ఎమ్మెల్యే కొడుకు మరణించిన ఘటన ఆందోళనకు గురి చేస్తోంది. రాజకీయాల్లో ఉన్నారంటే చాలు ఎంతో కొంత సంపాదించుకుంటారు నేతలు. ఆస్తుల్నిసైతం కూడబెడుతున్న ఈ సమయంలో కనీసం ఆస్పత్రి ఖర్చులకి..

ఆస్పత్రి ఖర్చులకి కూడా డబ్బు లేక మాజీ ఎమ్మెల్యే కొడుకు మరణం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 07, 2020 | 12:06 PM

Share

ఆస్పత్రి ఖర్చులు కూడా లేక మాజీ ఎమ్మెల్యే కొడుకు మరణించిన ఘటన ఆందోళనకు గురి చేస్తోంది. రాజకీయాల్లో ఉన్నారంటే చాలు ఎంతో కొంత సంపాదించుకుంటారు నేతలు. ఆస్తుల్ని సైతం కూడబెడుతున్న ఈ సమయంలో కనీసం ఆస్పత్రి ఖర్చులకి డబ్బులు లేక మాజీ ఎమ్మెల్యే కొడుకు మరణించాడు. స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే కర్రెళ్ల నర్సయ్య కొడుకు ఆనందం అనారోగ్యంతో మంచాన పడి చనిపోయాడు. సిరిసిల్ల జిల్లా మల్కపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మేస్త్రీ పని చేసుకుంటూ జీవించే ఆనందం కొంత కాలంగా కడుపులో కణతులతో బాధపడుతున్నాడు. ఇటీవల రూ.3 లక్షలు ఖర్చు చేసి ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు. అయినా కూడా ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాలేదు. ఇంకా మరో లక్ష ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో చేతిలో డబ్బు లేక.. సహాయం చేసేవారు ముందుకు రాకపోవడంతో ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఇలా చనిపోవడం పలువురిని కంటతడి పెట్టించింది.

కాగా కోనరావు పేట మండలం మల్కపేట గ్రామానికి చెందిన కర్రెళ్ల నర్సయ్య 1957-62 మధ్య అప్పట్టి నేరెళ్ల నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా పని చేశారు. అసలు ఏమాత్రం డబ్బులు ఆశించకుండా ప్రజా సేవకు పరిమితమై నిజాయితీగా పని చేశారు. తనకి గానీ, తన కుటుంబం కోసం కానీ ఎటువంటి ఆస్తులు సంపాదించుకోలేదు. 15 ఏళ్ల క్రితం నర్సయ్య మరణించారు.

Read More:

మీ అకౌంట్‌లో రూ.1500 పడలేదా? అయితే ఈ నెంబర్‌కి కాల్ చేయండి!

హీరోయిన్ తండ్రిని కత్తితో బెదిరించి.. ఫోన్ లాక్కెళ్లిన దొంగలు