Fire Accident: పాతబస్తీలో కలకలం.. ఎంఐఎం పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగుడు
హైదరాబాద్ పాతబస్తీలో AIMIM కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తి నిప్పటించాడు. న్యూ ఇందిరానగర్లోని హాశమాబాద్ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి బాటిల్లో పెట్రోల్ పోసి, నిప్పంటించాడు దుండగుడు. స్పాట్కు చేరుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

హైదరాబాద్ పాతబస్తీలో AIMIM కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తి నిప్పటించాడు. న్యూ ఇందిరానగర్లోని హాశమాబాద్ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి బాటిల్లో పెట్రోల్ తీసుకుచ్చి తలుపుపై పోశాడు. అనంతరం అటు ఇటు చూసి ఒక్కసారిగా అగ్గిపుల్లతో నిప్పంటించి పరారయ్యాడు. ఎగిసి పడుతున్న మంటలను గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
12 సంవత్సరాల క్రితం ఎంఐఎం పార్టీ కార్యాలయాన్ని తెరిచారు. మంగళవారం తెల్లవారుజామున ఉన్నట్టుండి మజ్లిస్ కార్యాలయంలో మంటలు చెలరేగుతుండడం హాట్ టాపిక్ గా మారింది. ఈసారి తొమ్మిది స్థానాల నుంచి పోటీచేసిన ఆ పార్టీ.. ఏడు స్థానాల్లోనే విజయం సాధించింది. చార్మినార్, యాకుత్పుర, చాంద్రాయణగుట్ట, బహదూర్పుర, మలక్పేట, కార్వాన్, నాంపల్లిలో గెలుపొందగా.. రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానాల్లో ఓటమి పాలైంది. ఈ సారి ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులు తమ సమీప ప్రత్యర్థులతో తీవ్ర పోటీని ఎదుర్కొన్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు రోజులకే ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…