AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేవంత్ రెడ్డి భూ వివాదంపై టీఆర్ఎస్ నేతలు ఏమన్నారంటే!

కబ్జాకు కాదేది అనర్హం అంటారు... అది పెద్దల భూమా... పేదల భూమా అన్నది కబ్జాకోరులకు సంబంధం లేదు. కన్నుపడిందంటే చాలు ఖతమే.... ఆ భూముల్లో రాబంధుల్లా రాలుతారు. గోపన్‌పల్లి, గంధంగూడలో సరిగ్గా ఇదే జరిగింది. దళితులను భయపెట్టి..

రేవంత్ రెడ్డి భూ వివాదంపై టీఆర్ఎస్ నేతలు ఏమన్నారంటే!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 14, 2020 | 10:41 AM

Share

కబ్జాకు కాదేది అనర్హం అంటారు… అది పెద్దల భూమా… పేదల భూమా అన్నది కబ్జాకోరులకు సంబంధం లేదు. కన్నుపడిందంటే చాలు ఖతమే…. ఆ భూముల్లో రాబంధుల్లా రాలుతారు. గోపన్‌పల్లి, గంధంగూడలో సరిగ్గా ఇదే జరిగింది. దళితులను భయపెట్టి ఏంతో కొంత ముట్టజెప్పి లాగేసుకున్నారు ఓ ఎంపీ. అయితే ఇలాంటి వ్యవహారాలను ఉపేక్షించే ప్రసక్తేలేదంటోంది తెలంగాణ సర్కారు. కబ్జాకోరుల భరతం పడతామని హెచ్చరిస్తోంది.

రంగారెడ్డి జిల్లా గంధంగూడ భూ కబ్జా వ్యవహారం తెలంగాణ శాసనమండలిలో ప్రస్తావనకు వచ్చింది. ఈ అంశాన్ని లేవనెత్తారు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ప్రభాకర్‌. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ ఎంపీ.. దళితుల భూమిని కబ్జా చేశారని.. అది వారికే ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. దాంతో పాటు పాటు దళితుల భూమిని కబ్జా చేసినవారిపై అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు. కబ్జాచేసిన భూమిని ఎప్పటిలోగా అప్పగిస్తారో చెప్పాలన్నారు ఎమ్మెల్సీ ప్రభాకర్‌.

ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించింది. గంధంగూడలో 3.22 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని… త్వరలో ఈ భూకబ్జా విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. అటు గోపన్‌పల్లి భూదందాపై కూడా త్వరలోనే స్పందిస్తామన్నారు. కబ్జా చేసిన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి.

పేదలకు అండగా ఉండాల్సిన ఓ ప్రజాప్రతినిధి కబ్జాకోరుగా మారిపోవడం ఏంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇతరులపై బురద జల్లడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇకనైనా దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని రాజకీయ పరిశీలకులు హితవు పలుకుతున్నారు.

Follow Us
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్: 8,262 ప్రత్యేక రైళ్లు!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్: 8,262 ప్రత్యేక రైళ్లు!
పుదీనా వీరికి విషంతో సమానం.. తినే ముందు ఈ విషయాలు తప్పక..
పుదీనా వీరికి విషంతో సమానం.. తినే ముందు ఈ విషయాలు తప్పక..
నీచు వాసన రాకుండా బోటి కూర మధ్యలో ఇవి వేస్తే చాలు
నీచు వాసన రాకుండా బోటి కూర మధ్యలో ఇవి వేస్తే చాలు
800 ఫోర్లు కొట్టిన మొట్టమొదటి ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు
800 ఫోర్లు కొట్టిన మొట్టమొదటి ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు
ఉదయాన్నే కాఫీ, టీకి బదులు మజ్జిగ తాగి చూడండి.. మీకు తిరుగుండదు!
ఉదయాన్నే కాఫీ, టీకి బదులు మజ్జిగ తాగి చూడండి.. మీకు తిరుగుండదు!
నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
బుమ్రా, సూర్యకుమార్‌లపై వేటు? హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం..!
బుమ్రా, సూర్యకుమార్‌లపై వేటు? హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం..!
నీట్‌ యూజీ 2026 పరీక్ష రూల్స్ ఇవే.. ఈ తప్పులు చేస్తే మీకే నష్టం!
నీట్‌ యూజీ 2026 పరీక్ష రూల్స్ ఇవే.. ఈ తప్పులు చేస్తే మీకే నష్టం!
వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట
వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట
భార్యను తిట్టిన భర్త.. తననే దూషించారనుకొని పక్కింటి మహిళ దాడి!
భార్యను తిట్టిన భర్త.. తననే దూషించారనుకొని పక్కింటి మహిళ దాడి!